అమెజాన్ ఫుడ్ డెలివరీ సేవలు బంద్..
- November 28, 2022
ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను నుంచి తప్పుకుంటుంది. ఇక నుంచి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు బంద్ కానున్నాయి. డిసెంబర్ 29 నుంచి ఫుడ్ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భాగస్వామ్య రెస్టారెంట్లకు సమాచారం అందించింది. కరోనా పీక్ స్టేజ్లో ఉన్నసమయంలో 2020, మే నెలలో అమెజాన్ భారత్లో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది.
మొదట బెంగళూరులో ప్రారంభమైన ఈ సర్వీస్ను.. క్రమంగా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. అయితే విస్తృతంగా ప్రచారం చేయకపోవడం, ప్రత్యేకంగా ఒక యాప్ లేకపోవడంతో వినియోగదారులను అంతగా ఆకర్షించలేకపోయింది. దీనికితోడు అప్పటికే ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో, స్విగ్గీలు దేశీయ మార్కెట్లో స్థిరపడిపోయాయి. దీంతో ఈ రంగంలో ఆశించినంతగా అమెజన్ రాణించలేకపోయింది.
దీంతో ఈ సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని అమెజన్ స్పష్టం చేసింది. ఫుడ్డెలివరీతోపాటు నిత్యావసరాల హోమ్ డెలివరీ సర్వీసును కూడా అమెజాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేస్తుండగా, నిత్యావసరాల సర్వీసును ఎన్నిరోజులు కొనసాగిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!







