అమెజాన్ ఫుడ్ డెలివరీ సేవలు బంద్..
- November 28, 2022
ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను నుంచి తప్పుకుంటుంది. ఇక నుంచి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు బంద్ కానున్నాయి. డిసెంబర్ 29 నుంచి ఫుడ్ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భాగస్వామ్య రెస్టారెంట్లకు సమాచారం అందించింది. కరోనా పీక్ స్టేజ్లో ఉన్నసమయంలో 2020, మే నెలలో అమెజాన్ భారత్లో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది.
మొదట బెంగళూరులో ప్రారంభమైన ఈ సర్వీస్ను.. క్రమంగా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. అయితే విస్తృతంగా ప్రచారం చేయకపోవడం, ప్రత్యేకంగా ఒక యాప్ లేకపోవడంతో వినియోగదారులను అంతగా ఆకర్షించలేకపోయింది. దీనికితోడు అప్పటికే ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో, స్విగ్గీలు దేశీయ మార్కెట్లో స్థిరపడిపోయాయి. దీంతో ఈ రంగంలో ఆశించినంతగా అమెజన్ రాణించలేకపోయింది.
దీంతో ఈ సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని అమెజన్ స్పష్టం చేసింది. ఫుడ్డెలివరీతోపాటు నిత్యావసరాల హోమ్ డెలివరీ సర్వీసును కూడా అమెజాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేస్తుండగా, నిత్యావసరాల సర్వీసును ఎన్నిరోజులు కొనసాగిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









