అమెజాన్ ఫుడ్ డెలివరీ సేవలు బంద్..
- November 28, 2022
ప్రముఖ ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులను నుంచి తప్పుకుంటుంది. ఇక నుంచి అమెజాన్ ఫుడ్ డెలివరీ సర్వీసులు బంద్ కానున్నాయి. డిసెంబర్ 29 నుంచి ఫుడ్ డెలివరీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భాగస్వామ్య రెస్టారెంట్లకు సమాచారం అందించింది. కరోనా పీక్ స్టేజ్లో ఉన్నసమయంలో 2020, మే నెలలో అమెజాన్ భారత్లో ఫుడ్ డెలివరీ సేవలను ప్రారంభించింది.
మొదట బెంగళూరులో ప్రారంభమైన ఈ సర్వీస్ను.. క్రమంగా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించింది. అయితే విస్తృతంగా ప్రచారం చేయకపోవడం, ప్రత్యేకంగా ఒక యాప్ లేకపోవడంతో వినియోగదారులను అంతగా ఆకర్షించలేకపోయింది. దీనికితోడు అప్పటికే ఫుడ్ డెలివరీ విభాగంలో జొమాటో, స్విగ్గీలు దేశీయ మార్కెట్లో స్థిరపడిపోయాయి. దీంతో ఈ రంగంలో ఆశించినంతగా అమెజన్ రాణించలేకపోయింది.
దీంతో ఈ సర్వీసులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామని అమెజన్ స్పష్టం చేసింది. ఫుడ్డెలివరీతోపాటు నిత్యావసరాల హోమ్ డెలివరీ సర్వీసును కూడా అమెజాన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఫుడ్ డెలివరీ సేవలను నిలిపివేస్తుండగా, నిత్యావసరాల సర్వీసును ఎన్నిరోజులు కొనసాగిస్తుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!







