విదేశీయులకు ఇండోనేషియా తీపి కబురు!
- November 29, 2022
జకార్తా: విదేశీయులకు ఇండోనేషియా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.కరోనా సంక్షోభం కారణంగా నిలిపివేసిన మల్టీపుల్ ఎంట్రీ వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు సోమవారం కీలక ప్రకటన చేశారు. ఇక మల్టీపుల్ ఎంట్రీ వీసాతో వ్యాపారవేత్తలు, విదేశీ పర్యాటకులు మళ్లీ మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోకుండా ఏడాదిలో పలుమార్లు ఇండోనేషియా వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. అలాగే విజిటర్ ఆ దేశంలో 60 రోజులు బస చేయవచ్చు. ఇకపోతే ఈ వీసాదారులు ఇండోనేషియాలోని రియావు దీవుల ప్రావిన్స్లో ప్రవేశించడానికి, అక్కడి నుండి స్వదేశానికి వెళ్లడానికి కూడా అనుమతించబడతారు. అలాగే సందర్శకులు బస సమయంలో దేశంలోని ఇతర ప్రాంతాలను సందర్శించడానికి సైతం ఎలాంటి రుసుము ఉండదు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







