ఆరోగ్యశ్రీ పై ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల
- November 29, 2022
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఫై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.ఇప్పటీకే ఆరోగ్యశ్రీ ఎన్నో చికిత్సలు తీసుకొచ్చిన జగన్..ఇప్పుడు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఇతర రాష్ట్రాల వ్యక్తులకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా…లేదా పొరుగు రాష్ట్రానికి చెందినవారైనా ఆరోగ్యశ్రీ పథకం కిందే చికిత్స జరగనుంది.దీనికి సంబంధించి జీవో ఎంఎస్ నెంబర్ 303 విడుదలైంది.
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాది 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ పరిస్థితిపై ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో జరిగిన సమీక్షలో మరణాల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు.ఈ సమీక్షలో భాగంగా ఈరోజు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.రాష్ట్రంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి ఆరోగ్యశ్రీ పధకం కింద పూర్తి చికిత్స అందనుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!