ఆ దేశంలో వారానికి నాలుగురోజులే పనిదినాలు
- November 29, 2022
యూకే: యూకేలోని పలు కంపెనీలు తమ ఉద్యోగులకు శుభవార్త అందించాయి.ఉద్యోగులకు పని ఒత్తడిని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంచలన ప్రకటన చేశాయి.ఇక పై ఆయా కంపెనీలకు చెందిన ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాలంటూ తీపి కబురు చెప్పాయి. ఇప్పటికే సాఫ్ట్వేర్ సంస్థలు వారానికి ఐదు రోజులు పనిదినాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా జీతంలో ఎలాంటి కోత పెట్టకుండా, పని గంటలను సర్దుబాటు చేయకుండా.. నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని సూచించాయి. వంద కంపెనీల్లో దాదాపు 2,600 మంది పని చేస్తున్నారు. 4డే వీక్ క్యాంపెయిన్లో భాగంగా ఈ మేరకు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. లండన్లోని అతి పెద్ద కంపెనీలు అయిన అటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్ సైతం ఈ జాబితాలో ఉండటం విశేషం.
అయితే ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ పనితీరు ఎలా ఉందనేది అవిన్ సీఈవో ఆడమ్ రాస్ వెల్లడించారు. కొత్త పాలసీతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, కంపెనీ ఉత్పాదకతలో మార్పులేదని పేర్కొన్నారు. ఉద్యోగుల పనివేళలను నిజాయతీగానే తగ్గించామని తెలిపారు. ఐదు రోజుల పనిగంటలను కుదించి నాలుగు రోజులకు సర్దుబాటు చేయలేదని చెప్పారు. ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ ఉత్పాదకత కొంచెం కూడా తగ్గలేదన్నారు.
తమ ఉద్యోగులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగుల వలసలను సైతం ఇది అడ్డుకుంటుందని పేర్కొన్నారు. కాగా, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, బోస్టన్ యూనివర్సిలకు చెందిన పరిశోధకులు.. సుమారు 3,300 మంది ఉద్యోగులు ఉన్న 70 కంపెనీల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ, ఫలితాలను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







