రష్మికను బ్యాన్ చేస్తే వాళ్లకే నష్టం అంటోన్న డైరెక్టర్.!
- November 30, 2022
ఏరు దాటాకా, తెప్ప తగిలేయడం అంటారు కదా.. ఆ తరహా కామెంట్లే ప్రస్తుతం రష్మికపై వినిపిస్తున్నాయ్. కన్నడ సినిమా ‘కిర్రిక్ పార్టీ’తో రష్మిక హీరోయిన్గా పరిచయమైంది. ఆ సినిమానే రష్మికకు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చింది.
రష్మిక పేరు కన్నడలోనే కాదు, తెలుగులోనూ మార్మోగిపోవడానికి కారణం ఆ సినిమానే. అయితే, ఆ ప్రస్థావన తీసుకురావడానికి రష్మిక అస్సలు ఇష్టపడడం లేదు ఇప్పుడు.
దాంతో, కన్నడిగులు రష్మికపై గుస్సా అవుతున్నారు. ఆమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రీసెంట్గా సంచలనాలు నమోదు చేసిన ‘కాంతార’ సినిమా కూడా రష్మికపై కన్నడిగుల గుస్సాకి కారణం. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమాని రష్మిక చూడలేదని చెప్పడం వివాదాలకు కారణమైంది.
తాజాగా ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ప్రమోషన్లలో డైరెక్టర్ నాగశేఖర్ ఈ విషయంపై స్పందించాడు. రష్మికను బ్యాన్ చేస్తే కన్నడ పరిశ్రమకే నష్టం. అయినా కృతజ్ఞతను ఆశిస్తే ఎప్పుడోకప్పుడు ఇలాగే బాధపడాల్సి వస్తుంది. సాయాన్ని గుర్తు పెట్టుకోవడం.. గుర్తుపెట్టుకోకపోవడం అనేది సాయం పొందిన ఆయా వ్యక్తుల వ్యక్తిగతం అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం రష్మిక, టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చెలామణీ అవుతోంది. అలాగే బాలీవుడ్లోనూ సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్కు? సమ్మర్ బ్రేక్కు ముందే క్లారిటీ..!!







