పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు 526 క్రిమినల్ కేసులు రిఫర్

- December 03, 2022 , by Maagulf
పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు 526 క్రిమినల్ కేసులు రిఫర్

బహ్రెయిన్: అక్టోబర్ 7 నుండి నవంబర్ 30 వరకు 4767 తనిఖీ సందర్శనలను నిర్వహించినట్లు, సంబంధిత ప్రభుత్వ ఏజెన్సీలతో 57 జాయింట్ ఇన్‌స్పెక్షన్ క్యాంపెయిన్‌లను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది. 526 క్రిమినల్ ఉల్లంఘనలను, 62 బలవంతపు లేబర్ కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 205,000 బహ్రెయిన్ దినార్‌లను జరిమానాల కింద వసూలు చేసినట్లు తెలిపింది. 505 మంది కార్మికులను బహిష్కరించినట్లు తెలిపింది. లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలను కట్టుబడి ఉండాలని యజమానులు, ఉద్యోగులకు అథారిటీ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com