కొత్త ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి: ప్రధాని మోడీ
- December 07, 2022
న్యూ ఢిల్లీ: మూడు వారాల పాటు జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు ప్రధాని మోడి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందన్నారు. జీ-20 సదస్సును భారత్ నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈ సమావేశాలు భారత్కు చాలా కీలకమన్నారు. కొత్త ఎంపీలకు , యువ ఎంపీలకు ప్రజాసమస్యలను ప్రస్తావించేందుకు సభలో అవకాశం లభించాలన్నారు ప్రధాని మోడీ. మొదటి వారం వేడిగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం సభలో ప్రధాని ప్రసంగిస్తున్నారు. పార్లమెంట్లో ప్రసంగిస్తున్నప్పుడు ప్రధాన మంత్రి, చైర్మన్కి సభతో పాటు దేశం తరపున కూడా అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







