30 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారత కార్ వాష్ వర్కర్...
- December 08, 2022
అబుధాబి: అబుధాబి బిగ్ టికెట్ ర్యాఫిల్ లో భారత్కు చెందిన కథార్ హుస్సేన్ ఏకంగా 30 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న విషయం తెలిసిందే.ఈ నెల 3వ తేదీన( శనివారం ) సాయంత్రం అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో తీసిన ర్యాఫిల్ డ్రాలో షార్జాలో ఉండే కథార్కు ఈ జాక్పాట్ తగిలింది.తీరా లాటరీ నిర్వాహకులు కాల్ చేసి అతనికి ఈ విషయం చెబుదామనుకుంటే ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.ఆ సమయంలో కథార్ యూఏఈలో విహారయాత్రలో ఉన్నాడట.కానీ డ్రాను లైవ్లో చూశాడు.దాంతో తాను భారీ ప్రైజ్మనీ గెలుచుకున్న విషయం తెలిసింది.
అంతే.. ఏమాత్రం ఆలస్యం చేకుండా టికెట్ బుక్ చేసుకుని రిటర్న్ ఫ్లైట్ ఎక్కేశాడు.షార్జా వచ్చిన తర్వాత నిర్వాహకులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.కథార్ హుస్సేన్ షార్జాలో ఉండే భారత ప్రవాసుడు కథార్ హుస్సేన్ది తమిళనాడు రాష్ట్రం.27 ఏళ్ల కథార్ షార్జాలోని ఓ కార్ వాష్ కంపెనీలో పని చేస్తున్నాడు. దానికి గాను అతనికి నెలకు 1500 దిర్హాములు జీతం వస్తుంది. అలాగే కస్టమర్లు టిప్స్ ఇస్తుంటారు.వాటితోనే కథార్ నవంబర్ 6వ తేదీన 246 సిరీస్లో 206975 నంబర్ గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ సర్వీస్ ద్వారా కొన్నాడు.ఇంకో విషయం ఏంటంటే 2 టికెట్లు కొంటే.. ఒక టికెట్ ఫ్రీ అనే ఆఫర్ సందర్భంగా కథార్ ఈ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







