‘గుర్తుందా శీతాకాలం’.! ఒక్క టిక్కెట్టుపై మూడు ప్రేమ కథలు.!
- December 08, 2022
సత్యదేవ్, తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. ఈ నెల 9న ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో తమన్నాతో పాటూ, మేఘా ఆకాష్, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ఓ ప్రత్యేకమైన కథనంతో సాగే మూడు ప్రేమకథల సమాహారం అని తెలుస్తోంది. కామెడీతో పాటూ, ఎమోషనల్ టచ్ వున్న లవ్ స్టోరీస్. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని హీరో సత్యదేవ్ ఆశా భావం వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ సినిమాతో తెలుగులోనూ, ‘రామ్సేతు’ సినిమాతో హిందీలోనూ ఆదరణ దక్కించుకున్న సత్యదేవ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయ్. కన్నడ దర్శకుడు నాగశేఖర్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేశారు.
ఈ మధ్య సత్యదేవ్ సంపాదించుకున్న అపారమైన క్రేజ్, ‘గుర్తుందా శీతాకాలం’ సక్సెస్కి ఎంత మేర యూజ్ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!







