చైనాతో సహకార స్థాయిని పెంచుకుంటాం..అరబ్-చైనీస్ సమ్మిట్లో క్రౌన్ ప్రిన్స్
- December 10, 2022
రియాద్: అరబ్ దేశాలు చైనాతో సహకార స్థాయిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, తమ భాగస్వామ్యంలో కొత్త దశ కోసం ఎదురుచూస్తున్నాయని సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు. శుక్రవారం రియాద్లో జరిగిన అరబ్-చైనీస్ సమ్మిట్ ఫర్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో తన ప్రారంభ ప్రసంగంలో క్రౌన్ ప్రిన్స్ అరబ్ దేశాలు, చైనా మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అరబ్ నాయకులు, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ హాజరైన శిఖరాగ్ర సమావేశంలో క్రౌన్ ప్రిన్స్ ప్రసంగిస్తూ.. అరబ్-చైనీస్ సంబంధాలు పరస్పర గౌరవం, సహకారంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వం కోసం సహకారాన్ని పెంపొందించడానికి సౌదీ కృషి చేస్తోందన్నారు. అరబ్-చైనీస్ శిఖరాగ్ర సమావేశానికి ముందు క్రౌన్ ప్రిన్స్ చైనీస్-గల్ఫ్ శిఖరాగ్ర సమావేశంలో చైనా-గల్ఫ్ సహకారంలో కొత్త చారిత్రక దశకు పునాది వేస్తుందన్నారు.
అధ్యక్షుడు జి జిన్పింగ్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం సౌదీ అరేబియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యారు. జి జిన్పింగ్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో గురువారం జరిగిన సౌదీ-చైనా సమ్మిట్కు రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షత వహించారు.
తాజా వార్తలు
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!







