బహ్రెయిన్లో దోమల నియంత్రణకు ప్రత్యేక బృందాలు
- December 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో కీటకాలు,దోమల వ్యాప్తిని అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని కోసం 24 మంది ఉద్యోగులు, 16 వాహనాలతో కూడిన ప్రత్యేక బృందం అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మలేరియా, కీటకాల నియంత్రణ గ్రూప్, రోడెంట్ కంట్రోల్ గ్రూప్ ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వడానికి ప్రత్యేకించి సంతానోత్పత్తి సీజన్లలో అవగాహన క్యాంపెయిన్ లను నిర్వహిస్తుందన్నారు. పౌరులు, నివాసితులందరికీ దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారాలను చేపట్టామన్నారు. వివిధ ప్రాంతాలు, గవర్నరేట్లలో పురుగుమందులను పిచికారీ చేయడానికి, అలాగే పరిస్థితిని అంచనా వేయడానికి ప్రచారాలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని, సందేహాలుంటే నేరుగా హాట్లైన్ నంబర్ 66701633 ద్వారా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. ముహర్రాక్, సదరన్, నార్తర్న్ గవర్నరేట్లలో డ్రైన్లు, రాళ్లను పబ్లిక్ స్క్వేర్ల నుండి శుభ్రం చేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల గురించి మంత్రిత్వ శాఖకు హాట్లైన్ నంబర్ 80008188 ద్వారా తెలియజేయాలని కోరింది.
తాజా వార్తలు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!
- ఖతార్ లో రమదాన్ క్యాలెండర్.. నెలంతా సందడే..!!
- ఒమానీ పౌరులకు అజర్బైజాన్ గుడ్ న్యూస్..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై పరిమితులు..!!
- బహ్రెయిన్ పౌరులకే పబ్లిక్ ఫార్మసీలు..!!
- దుబాయ్ లో పెయిడ్ పార్కింగ్ అవర్స్ రివైజ్డ్..రెండు గంటలు ఫ్రీ..!!
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్పోర్ట్గా హైదరాబాద్..









