బహ్రెయిన్లో దోమల నియంత్రణకు ప్రత్యేక బృందాలు
- December 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో కీటకాలు,దోమల వ్యాప్తిని అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని కోసం 24 మంది ఉద్యోగులు, 16 వాహనాలతో కూడిన ప్రత్యేక బృందం అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మలేరియా, కీటకాల నియంత్రణ గ్రూప్, రోడెంట్ కంట్రోల్ గ్రూప్ ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వడానికి ప్రత్యేకించి సంతానోత్పత్తి సీజన్లలో అవగాహన క్యాంపెయిన్ లను నిర్వహిస్తుందన్నారు. పౌరులు, నివాసితులందరికీ దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారాలను చేపట్టామన్నారు. వివిధ ప్రాంతాలు, గవర్నరేట్లలో పురుగుమందులను పిచికారీ చేయడానికి, అలాగే పరిస్థితిని అంచనా వేయడానికి ప్రచారాలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని, సందేహాలుంటే నేరుగా హాట్లైన్ నంబర్ 66701633 ద్వారా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. ముహర్రాక్, సదరన్, నార్తర్న్ గవర్నరేట్లలో డ్రైన్లు, రాళ్లను పబ్లిక్ స్క్వేర్ల నుండి శుభ్రం చేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల గురించి మంత్రిత్వ శాఖకు హాట్లైన్ నంబర్ 80008188 ద్వారా తెలియజేయాలని కోరింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







