బహ్రెయిన్లో దోమల నియంత్రణకు ప్రత్యేక బృందాలు
- December 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్లో కీటకాలు,దోమల వ్యాప్తిని అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని కోసం 24 మంది ఉద్యోగులు, 16 వాహనాలతో కూడిన ప్రత్యేక బృందం అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మలేరియా, కీటకాల నియంత్రణ గ్రూప్, రోడెంట్ కంట్రోల్ గ్రూప్ ప్రజారోగ్యానికి భరోసా ఇవ్వడానికి ప్రత్యేకించి సంతానోత్పత్తి సీజన్లలో అవగాహన క్యాంపెయిన్ లను నిర్వహిస్తుందన్నారు. పౌరులు, నివాసితులందరికీ దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారాలను చేపట్టామన్నారు. వివిధ ప్రాంతాలు, గవర్నరేట్లలో పురుగుమందులను పిచికారీ చేయడానికి, అలాగే పరిస్థితిని అంచనా వేయడానికి ప్రచారాలు కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తప్పుడు వార్తలను నమ్మవద్దని, సందేహాలుంటే నేరుగా హాట్లైన్ నంబర్ 66701633 ద్వారా సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. ముహర్రాక్, సదరన్, నార్తర్న్ గవర్నరేట్లలో డ్రైన్లు, రాళ్లను పబ్లిక్ స్క్వేర్ల నుండి శుభ్రం చేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని పేర్కొంది. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల గురించి మంత్రిత్వ శాఖకు హాట్లైన్ నంబర్ 80008188 ద్వారా తెలియజేయాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







