బంగ్లాదేశ్ పై టీమిండియా ఘన విజయం
- December 10, 2022
ఢాకా: బంగ్లాదేశ్లోని చటోగ్రామ్ జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ పై భారత్ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నేటి మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బంగ్లాదేశ్ ముందు భారత్ 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే
బంగ్లాదేశ్ ఏ దశంలోనూ రాణించలేకపోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లో షకీబ్ (43) మినహా మిగతా ఏ ఆటగాడూ చెప్పుకోదగ్గ రీతిలో బ్యాటింగ్ లో రాణించలేదు. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లో అనముల్ 8, లిట్టన్ దాస్ 29, షకీబ్ 43, రహీం 7, యాసిర్ అలీ 25, ముహ్ముదుల్లా 20, అఫిఫ్ 8, మెహెదీ హసన్ 3, టాస్కిన్ అహ్మద్ 17, ఎదాబత్ 0, ముస్తాఫిజర్ రెహ్మాన్ 13 పరుగులు చేశారు.
దీంతో 34 ఓవర్లకు బంగ్లాదేశ్ 182 పరుగులు మాత్రమే సాధించింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ రెండేసి వికెట్లు, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ మ్యాచులో భారత బ్యాట్స్మెన్లో శిఖర్ ధావన్ 3, ఇషాంత్ కిషన్ 210 (131 బంతుల్లో 10 సిక్సులు, 24 ఫోర్ల సాయంతో), విరాట్ కోహ్లీ 113 (90 బంతుల్లో 2 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో) పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 3, కేఎల్ రాహుల్ 8, వాషింగ్టన్ సుందర్ 37, అక్షర్ పటేల్ 20, శార్దూల్ ఠాకూర్ 3, కుల్దీప్ యాదవ్ 3 (నాటౌట్) , మొహమ్మద్ సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.
టీమిండియా స్కోరు 50 ఓవర్లకు 409/8గా నమోదైంది. బంగ్లా బౌలర్లలో షకీబ్ హసన్, ఎదాబత్, టస్కిన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా, మెహిదీ హసన్, ముస్తాఫఇజుర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు. కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







