ముగిసిన చైనా అధ్యక్షుడి సౌదీ పర్యటన
- December 11, 2022
రియాద్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సౌదీ అరేబియాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనను ముగిసింది. కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, రియాద్ రీజియన్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్ బిన్ అబ్దుల్ అజీజ్ ఆయనకు వీడ్కోలు పలికారు. ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, విదేశాంగ మంత్రి; యాసర్ అల్-రుమ్యాన్, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గవర్నర్, చైనా ప్రతినిధి బృందానికి అధికారిక మార్గదర్శిగా పనిచేశారు.
రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు జీ జిన్పింగ్ బుధవారం రియాద్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో జిన్పింగ్ i రాజు సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్తో విస్తృత చర్చలు జరిపారు. సౌదీ అరేబియా నాయకులు, చైనా అధ్యక్షుడు చైనా-సౌదీ అరేబియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సంయుక్తంగా ముందుకు తీసుకెళ్లడానికి, మరింత గొప్ప పురోగతిని సాధించడానికి అంగీకరించారు. ఇటీవలి సంవత్సరాలలో చైనా-సౌదీ అరేబియా సంబంధాలు ఉన్నత స్థాయి వృద్ధిని కొనసాగించాయని పేర్కొన్నారు. అభివృద్ధి, సహకారం కోసం జరిగిన మొదటి అరబ్-చైనా సమ్మిట్, జీసీసీ-చైనా సమ్మిట్కు కూడా జిన్పింగ్ శుక్రవారం హాజరయ్యారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







