అరుణాచల్ వద్ద భారత యుద్ధ విమానాలు పెట్రోలింగ్
- December 13, 2022
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ వద్ద డిసెంబర్ 9వ తేదీన చైనా, భారత సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బోర్డర్ వద్ద యుద్ధ విమానాలతో భారత్ పెట్రోలింగ్ నిర్వహిస్తోంది. చైనా ఉల్లంఘనలను అడ్డుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి భారత వైమానిక దళాలు పెట్రోలింగ్ చేపడుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అరుణాచల్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జోరుగా పెట్రోలింగ్ జరుగుతున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 9వ తేదీన తవాంగ్ సెక్టార్ వద్ద చైనా బలగాలు ఎల్ఏసీ దాటి భారత భూభాగంలోకి వచ్చినట్లు సమాచారం. అయితే భారతీయ సైనికులు చైనా ఆర్మీని ధీటుగా ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ పార్లమెంట్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ఘర్షణ రోజున ఇరు వర్గాల దళాలకు స్వల్ప స్థాయిలో గాయాలైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ ప్రాంతం నుంచి రెండు దేశాలకు చెందిన బలగాలు వెనక్కి వెళ్లాయి.
తాజా వార్తలు
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్
- AP కి కొత్త రాజధానిగా మావిగాన్ ని ప్రతిపాదించిన YS జగన్..
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం









