సెంట్రల్ యూనివర్సిటీల్లో 11,000 అధ్యాపక పోస్టులు ఖాళీ..
- December 13, 2022
న్యూ ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలలో 11 వేల అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం(డిసెంబర్12,2022) మంత్రి లోక్ సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దేశంలోని 45 కేంద్ర విశ్వవిద్యాలయాల్లో 18,956 పోస్టులు మంజూరు కాగా, 6,180 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఐఐటీల్లో 11,170 పోస్టులు మంజూరవ్వగా, 4,502 ఖాళీ పోస్టులున్నాయని పేర్కొన్నారు.
ఐఐఎంలలో మంజూరైన పోస్టులు 1,566 కాగా, 493 ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పారు.కేంద్ర యూనివర్సిటీలు, ఐఐఎంలలో ఖాళీగా ఉన్న పోస్టులో 961 పోస్టులు ఎస్సీ రిజర్వ్ డ్, 578 పోస్టులు ఎస్టీ రిజర్వ్ డ్, 1657 పోస్టులు ఓబీసీ కేటగిరి కింద ఉన్నాయని వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ కేటగిరిలో వరుసగా 643, 301 ఖాళీ పోస్టులు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు.
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్ సీఎల్ టీ)లో దాదాపు సగం పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్ సీఎల్ టీకి వేర్వేరు ప్రాంతాల్లో బెంచులు ఉన్నాయని పేర్కొన్నారు. వీటన్నింటికి గానూ మొత్తం 1 ప్రెసిడెంట్ తోపాటు 31 మంది జ్యూడీషియల్, 31 మంది టెక్నికల్ సభ్యులు ఉండాలన్నారు. కానీ ప్రస్తుతం 1 ప్రెసిడెంట్ తోపాటు 18 మంది జ్యూడీషియల్, 19 మంది టెక్నికల్ సభ్యులే పని చేస్తున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!
- జీ మెయిల్కి వింత పేర్లు పెడితే అకౌంట్ క్లోజ్









