డెలివరీ రైడర్లకు కొత్త లైసెన్స్ విధానం
- December 15, 2022
దుబాయ్: ఎమిరేట్లోని డెలివరీ రైడర్లను ధృవీకరించే కార్యక్రమాన్ని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. డెలివరీ మోటార్బైక్ రైడర్ల పనితీరును మెరుగుపరచడం, దుబాయ్లో విస్తృత శ్రేణి వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచడం తమ లక్ష్యమని అథారిటీ తెలిపింది. డెలివరీ కంపెనీలు తమ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్లు, అప్లికేషన్ల ద్వారా అందుబాటులో ఉన్న డ్రైవర్ అర్హత సర్టిఫికేట్ను తప్పనిసరిగా పొందాలని RTA పేర్కొంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో దుబాయ్లోని అధికారులు మోటర్బైక్ రైడర్లను వేగంగా నడపడం, ట్రాఫిక్ నియమాలను విస్మరించడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడానికి పెద్దస్థాయిలో ప్రచారాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు లైసెన్సు ఇవ్వడం మరింత కఠినం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం.. గతేడాది మోటార్సైకిళ్లతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మరణించగా, 253 మంది గాయపడ్డారు. సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో, పోలీసు ట్రాఫిక్ విభాగం 46 ప్రమాదాలను నమోదు చేసింది. ఇందులో ముగ్గురు మరణించగా.. 47 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









