డెలివరీ రైడర్లకు కొత్త లైసెన్స్ విధానం
- December 15, 2022
దుబాయ్: ఎమిరేట్లోని డెలివరీ రైడర్లను ధృవీకరించే కార్యక్రమాన్ని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. డెలివరీ మోటార్బైక్ రైడర్ల పనితీరును మెరుగుపరచడం, దుబాయ్లో విస్తృత శ్రేణి వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచడం తమ లక్ష్యమని అథారిటీ తెలిపింది. డెలివరీ కంపెనీలు తమ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్లు, అప్లికేషన్ల ద్వారా అందుబాటులో ఉన్న డ్రైవర్ అర్హత సర్టిఫికేట్ను తప్పనిసరిగా పొందాలని RTA పేర్కొంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో దుబాయ్లోని అధికారులు మోటర్బైక్ రైడర్లను వేగంగా నడపడం, ట్రాఫిక్ నియమాలను విస్మరించడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడానికి పెద్దస్థాయిలో ప్రచారాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు లైసెన్సు ఇవ్వడం మరింత కఠినం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం.. గతేడాది మోటార్సైకిళ్లతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మరణించగా, 253 మంది గాయపడ్డారు. సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో, పోలీసు ట్రాఫిక్ విభాగం 46 ప్రమాదాలను నమోదు చేసింది. ఇందులో ముగ్గురు మరణించగా.. 47 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







