డెలివరీ రైడర్లకు కొత్త లైసెన్స్ విధానం
- December 15, 2022
దుబాయ్: ఎమిరేట్లోని డెలివరీ రైడర్లను ధృవీకరించే కార్యక్రమాన్ని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. డెలివరీ మోటార్బైక్ రైడర్ల పనితీరును మెరుగుపరచడం, దుబాయ్లో విస్తృత శ్రేణి వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచడం తమ లక్ష్యమని అథారిటీ తెలిపింది. డెలివరీ కంపెనీలు తమ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్లు, అప్లికేషన్ల ద్వారా అందుబాటులో ఉన్న డ్రైవర్ అర్హత సర్టిఫికేట్ను తప్పనిసరిగా పొందాలని RTA పేర్కొంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో దుబాయ్లోని అధికారులు మోటర్బైక్ రైడర్లను వేగంగా నడపడం, ట్రాఫిక్ నియమాలను విస్మరించడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడానికి పెద్దస్థాయిలో ప్రచారాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు లైసెన్సు ఇవ్వడం మరింత కఠినం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం.. గతేడాది మోటార్సైకిళ్లతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మరణించగా, 253 మంది గాయపడ్డారు. సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో, పోలీసు ట్రాఫిక్ విభాగం 46 ప్రమాదాలను నమోదు చేసింది. ఇందులో ముగ్గురు మరణించగా.. 47 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







