డెలివరీ రైడర్లకు కొత్త లైసెన్స్ విధానం
- December 15, 2022
దుబాయ్: ఎమిరేట్లోని డెలివరీ రైడర్లను ధృవీకరించే కార్యక్రమాన్ని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. డెలివరీ మోటార్బైక్ రైడర్ల పనితీరును మెరుగుపరచడం, దుబాయ్లో విస్తృత శ్రేణి వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచడం తమ లక్ష్యమని అథారిటీ తెలిపింది. డెలివరీ కంపెనీలు తమ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారమ్లు, అప్లికేషన్ల ద్వారా అందుబాటులో ఉన్న డ్రైవర్ అర్హత సర్టిఫికేట్ను తప్పనిసరిగా పొందాలని RTA పేర్కొంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో దుబాయ్లోని అధికారులు మోటర్బైక్ రైడర్లను వేగంగా నడపడం, ట్రాఫిక్ నియమాలను విస్మరించడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడానికి పెద్దస్థాయిలో ప్రచారాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు లైసెన్సు ఇవ్వడం మరింత కఠినం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం.. గతేడాది మోటార్సైకిళ్లతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మరణించగా, 253 మంది గాయపడ్డారు. సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో, పోలీసు ట్రాఫిక్ విభాగం 46 ప్రమాదాలను నమోదు చేసింది. ఇందులో ముగ్గురు మరణించగా.. 47 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- మహాలక్ష్మి ‘స్మార్ట్ కార్డులు’..తొలుత ఇచ్చేది వారికే!
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- ఈద్ అల్ ఫితర్: GCC కంట్రీస్ టూర్లకు ప్రాధాన్యత ఎందుకు?
- ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెసేజులపై ఖతార్ క్లారిటీ..!!
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం









