ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- February 21, 2026
కువైట్: అనుమతి లేకుండా రమదాన్ సందర్భంగా సమావేశాలు నిర్వహిస్తే జరిమానాలకు సంబంధించిన వార్తలను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని పేర్కొన్నది. అనుమతి లేకుండా ఇఫ్తార్ పార్టీలు నిర్వహిస్తే 1,000 కువైట్ దినార్ల జరిమానాలు మరియు 6 నెలల జైలు శిక్ష విధిస్తామన్న వార్తల్లో నిజం లేదని, అవన్ని తప్పుడు కథనాలని కువైట్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఈ విషయంపై తాము ఎటువంటి ప్రకటన లేదా ఉత్తర్వులు జారీ చేయలేదని అథారిటీ పేర్కొంది. అధికారిక ఛానెల్ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రేమే విశ్వసించాలని కొరింది. ఫేక్ వార్తలను షేర్ చేసే విషయంలో క్రాస్ చేక్ చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









