భారతదేశ విమానాశ్రయాలలో ర్యాండమ్ కొవిడ్ పరీక్షలు
- December 22, 2022
యూఏఈ: చైనా, కొన్ని ఇతర దేశాలలో కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణీకులకు ర్యాండమ్ కొవిడ్ పరీక్షను భారతదేశం తిరిగి ప్రవేశపెట్టింది. దేశంలోని కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశం తరువాత ఈ చర్య తీసుకున్నారు. ఒమిక్రాన్ సబ్వేరియంట్ BF.7 కారణంగా చైనాలో కోవిడ్-19 కేసుల పెరుగుదల నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఇప్పటివరకు ఈ వేరియంట్ కు సంబంధించిన మూడు కేసులు నమోదు అయ్యాయి.
భారతదేశంలోని అర్హులైన జనాభాలో కేవలం 27-28 శాతం మంది మాత్రమే కొవిడ్-19 ముందు జాగ్రత్త మోతాదు తీసుకున్నారని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రజలు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్లు ధరించాలని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్ సూచించారు. ఈ క్రమంలో చైనా సహా వివిధ దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల కోసం ర్యాండమ్ కొవిడ్ పరీక్షలు చేపట్టినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!







