భారతదేశ విమానాశ్రయాలలో ర్యాండమ్ కొవిడ్ పరీక్షలు

- December 22, 2022 , by Maagulf
భారతదేశ విమానాశ్రయాలలో ర్యాండమ్ కొవిడ్ పరీక్షలు

యూఏఈ: చైనా, కొన్ని ఇతర దేశాలలో కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని విమానాశ్రయాలలో అంతర్జాతీయ ప్రయాణీకులకు ర్యాండమ్ కొవిడ్ పరీక్షను భారతదేశం తిరిగి ప్రవేశపెట్టింది. దేశంలోని కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశం తరువాత ఈ చర్య తీసుకున్నారు. ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ BF.7 కారణంగా చైనాలో కోవిడ్-19 కేసుల పెరుగుదల నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. భారతదేశంలో ఇప్పటివరకు ఈ వేరియంట్ కు సంబంధించిన మూడు కేసులు నమోదు అయ్యాయి. 
భారతదేశంలోని అర్హులైన జనాభాలో కేవలం 27-28 శాతం మంది మాత్రమే కొవిడ్-19 ముందు జాగ్రత్త మోతాదు తీసుకున్నారని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రజలు బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి.కె. పాల్ సూచించారు. ఈ క్రమంలో చైనా సహా వివిధ దేశాల నుండి వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల కోసం ర్యాండమ్ కొవిడ్ పరీక్షలు చేపట్టినట్లు వారు తెలిపారు.
 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com