దుబాయ్‌లో దొంగతనం.. ఐదుగురికి జైలు, జరిమానా

- December 26, 2022 , by Maagulf
దుబాయ్‌లో దొంగతనం.. ఐదుగురికి జైలు, జరిమానా

దుబాయ్: దొంగనం ఆరోపణలపై అరెస్టయిన ఐదుగురు నిందితులకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ మూడు నెలల జైలుశిక్ష,  Dhs8,000 జరిమానా విధించింది. ఇందులో నలుగురు ఆఫ్రికన్లు ఉన్నారు. శిక్షా కాలం పూర్తయిన తర్వాత వారిని బహిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గత జూలైలో అల్ వాస్ల్‌లోని ఒక కేఫ్ మేనేజర్ తన కార్యాలయంలోని సేఫ్ నుండి 8,000 Dhs దొంగిలించబడిందని ఫిర్యాదు చేశాడు. సంఘటన జరిగిన ఉదయం, తన సేఫ్ నుండి డబ్బు దొంగిలించబడినట్లు గుర్తించానని, అది పగలగొట్టినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని ఫిర్యాదులో  పేర్కొన్నాడు. డిటెక్టివ్‌ల బృందం కేఫ్‌లో పనిచేస్తున్న ముగ్గురు నిందితులే దొంగతనానికి పాల్పడ్డారని నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఇతరుల సహకారంతో కేఫ్‌లోని డబ్బును దొంగిలించేందుకు ప్లాన్ చేసినట్లు నిందితులు అంగీకరించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com