ఉద్యోగాల పేరుతో ప్రవాసులను ముంచుతున్న ఆన్లైన్ స్కామర్లు
- December 26, 2022
బహ్రెయిన్: ఉద్యోగాల ప్రకటనలతో ఆన్లైన్ స్కామర్లు ప్రవాసులను నిండా ముంచుతున్నాయి. వాట్సాప్ మెసేజ్లు పంపడం ద్వారా ఆశావహులను సులువుగా బుట్టలో వేసుకుంటున్నాయి. ఫుల్ టైమ్, పార్ట్టైమ్ జాబ్లను ఆఫర్ చేయడం ద్వారా ప్రవాసులను ఆకర్షించి అనంతరం వారిని నిండా ముంచుతున్నారని ఎన్ఆర్ఐ కౌన్సిల్ అధికారి తెలిపారు. ఈ ఫేక్ ప్రకటనలతో కంపెనీల బారిన పడే నిర్వాసితులు భద్రత గాల్లో దీపంగా మారుతుందన్నారు. అనుకోని ప్రమాదాల జరిగినప్పుడు నష్టపరిహారం చెల్లించడానికి అలాంటి కంపెనీలు బాధ్యత వహించవని వరల్డ్ ఎన్ఆర్ఐ కౌన్సిల్లోని మిడిల్ ఈస్ట్ రీజియన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ డైరెక్టర్ సుధీర్ తిరునిలత్ చెప్పారు. మోసపోతున్న వారిలో బాధితులు ఎక్కువగా విజిట్ వీసాలపై పనికోసం వచ్చినవారే అధికమన్నారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా సేల్స్ డిగ్రీలను కలిగి ఉన్న చాలా మంది ఉద్యోగం కోసం ఇక్కడకు రప్పించి అందినకాడికి దండుకుంటారు. ఆ తర్వాత వారిని 100 నుండి 200 బహ్రెయిన్ దినార్ల ఉద్యోగాలలో నియమించి చేతులు దులుపుకుంటారు. మోసపోయిన వారు బహిష్కరణ భయంతో నిందితులపై ఫిర్యాదు చేయని కారణంగా మోసగాళ్లపై చర్యలు తీసుకోవడం లేదని భద్రతాధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







