నూతన సంవత్సర వేడుకలు.. విమానాశ్రయాల్లో రద్దీ
- December 27, 2022
కువైట్: న్యూ ఇయర్ సెలవులకు సన్నాహకంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల సంఖ్య పెరగనున్నది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సర్వీసుల సంఖ్యలను పెంచినట్లు కువైట్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమానయాన గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 29 నుండి జనవరి 1 వరకు 1,284 విమాన సర్వీసుల ద్వారా సుమారు 139,000 మంది ప్రయాణించనున్నారు. దుబాయ్, కైరో, ఇస్తాంబుల్, జెద్దాలకు అత్యధికంగా బుకింగ్స్ జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. 642 విమాన సర్వీసుల ద్వారా 78,000 మంది ప్రయాణీకులు వెళతారని, అదే సమయంలో 642 విమాన సర్వీసులలో 61,000 మంది ప్రయాణీకులు కువైట్ వస్తారని విమానాశ్రయాల అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







