నూతన సంవత్సర వేడుకలు.. విమానాశ్రయాల్లో రద్దీ
- December 27, 2022
కువైట్: న్యూ ఇయర్ సెలవులకు సన్నాహకంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల సంఖ్య పెరగనున్నది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సర్వీసుల సంఖ్యలను పెంచినట్లు కువైట్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విమానయాన గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 29 నుండి జనవరి 1 వరకు 1,284 విమాన సర్వీసుల ద్వారా సుమారు 139,000 మంది ప్రయాణించనున్నారు. దుబాయ్, కైరో, ఇస్తాంబుల్, జెద్దాలకు అత్యధికంగా బుకింగ్స్ జరిగాయని అధికార వర్గాలు తెలిపాయి. 642 విమాన సర్వీసుల ద్వారా 78,000 మంది ప్రయాణీకులు వెళతారని, అదే సమయంలో 642 విమాన సర్వీసులలో 61,000 మంది ప్రయాణీకులు కువైట్ వస్తారని విమానాశ్రయాల అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!







