అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండో స్థానం
- December 27, 2022
తిరుమల: ఈ ఏడాది భక్తులు అత్యధికంగా దర్శించుకున్న పుణ్యక్షేత్రాల్లో తిరుమల రెండో స్థానంలో నిలిచింది. కరోనా ఆంక్షల కారణంగా గతేడాది తక్కువ సంఖ్యలో భక్తులు సందర్శించుకోగా, ఈసారి ఆంక్షల సడలింపుతో వారి సంఖ్య పెరిగింది. ఈ మేరకు ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు తెలిపింది. దేశవ్యాప్తంగా భక్తులు సందర్శించిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై నిర్వహించిన సర్వే అనంతరం ఈ నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ఆలయాల్లో వారణాసి మొదటి స్థానంలో నిలవగా, తిరుమల ఆ తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే, తిరుపతిలో పర్యాటకుల గదుల బుకింగ్ గతేడాదితో పోలిస్తే 233 శాతం పెరిగినట్టు ఓయో రిపోర్టు పేర్కొంది. ఆ తర్వాతి స్థానాల్లో వారణాసి, షిరిడీ ఉన్నాయి.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







