ప్రధాని మోడీతో సిఎం జగన్ సమావేశం
- December 28, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో సిఎం జగన్ భేటీ అయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చిన జగన్ కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు ప్రాజెక్టుల గురించి, ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీల గురించి, అలాగే మూడు రాజధానుల అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సిఎం జగన్ సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని నివాసంలో ఉన్నారు.
సీఎం జగన్ తోపాటు వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నారు. ప్రధానితో భేటీ ముగిశాక మధ్యాహ్నం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తోనూ జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే రాత్రి 10గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ సమావేశం అయ్యేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









