ప్రధాని మోడీతో సిఎం జగన్ సమావేశం
- December 28, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో సిఎం జగన్ భేటీ అయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చిన జగన్ కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు ప్రాజెక్టుల గురించి, ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీల గురించి, అలాగే మూడు రాజధానుల అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సిఎం జగన్ సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని నివాసంలో ఉన్నారు.
సీఎం జగన్ తోపాటు వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నారు. ప్రధానితో భేటీ ముగిశాక మధ్యాహ్నం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తోనూ జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే రాత్రి 10గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ సమావేశం అయ్యేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







