ఈ నెల 30న యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు
- December 28, 2022
హైదరాబాద్: ప్రముఖ ఆలయం యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం.. ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు నిర్వహించే ఆర్జిత సేవలు, ప్రత్యేక, ధర్మదర్శనాలను రద్దు చేస్తున్నామని ఆలయ ఈవో గీత చెప్పారు. అదేవిధంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు బ్రేక్ దర్శనాలను కూడా క్యాన్సల్ చేస్తున్నామని వెల్లడించారు. నిత్యకైంకర్యాలను ఆంతరంగికంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు యాదాద్రీశ్వరుడిని నలుగురు రాష్ట్రపతులు మాత్రమే దర్శించుకోవడం విశేషం.
కాగా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారన్న సమాచారంతో గతంలో యాదగిరీశుడిని దర్శించుకున్న రాష్ట్రపతులపై చర్చ సాగుతున్నది. తొలి రాష్టపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణణ్, 9వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్దయాల్శర్మ, 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా 15వ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నారసింహుడిని దర్శించుకోనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







