బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
- December 29, 2022
న్యూ ఢిల్లీ: యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచి భారత్ ఇవాళ చేసిన ప్రయోగం విజయవంతమైంది.400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని అది ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఎస్యూ-30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత ఓడను ధ్వంసం చేసిందని తెలిపారు. ఇది గగనతలం నుంచి నౌకలను ధ్వంసం చేయగలిగే వెర్షన్ క్షిపణి అని చెప్పారు.
బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితత్వంతో ఛేదించిందని వివరించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. ఎస్యూ-30ఎంకేఐ యుద్ధ విమానాల నుంచి భూతల, సముద్రతల సుదీర్ఘ లక్ష్యాలను మరింత కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారతీయ వైమానిక దళం సంపాదించినట్లయిందని అధికారులు తెలిపారు.
భారతీయ వైమానిక దళం వ్యూహాత్మకంగా తమ లక్ష్యాలను ఛేదించడానికి, భవిష్యత్తుల్లో యుద్ధాల్లో శత్రుదేశాలపై పై చేయి సాధించడానికి ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి మరింత ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ప్రయోగం చేపట్టడానికి భారత వైమానిక దళం, నౌకా దళం, డీఆర్డీవో, బీఏపీఎల్, హల్ కృషి చేశాయని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచుకుంటూ భారత్ ఇప్పటికే అనేక విజయాలు సాధించింది. ఈ ఏడాది మేలోనూ ఎస్యూ-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భారత్ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం చేపట్టి విజయవంతమైంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







