12 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్.! ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.!
- December 29, 2022
నాగ చైతన్య, సమంత కాంబినేషన్లో వచ్చిన ‘ఏ మాయ చేశావె’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమా ద్వారానే సమంత హీరోయిన్గా పరిచయమైంది.
అక్కడి నుంచే చై, సామ్ మధ్య స్నేహం కూడా విరిసింది. ఆ స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దదై పెళ్లి వరకూ వెళ్లింది. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారనుకోండి.
అసలు మ్యాటర్ ఏంటంటే, 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందట. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత మంచి కాన్సెప్ట్తో సీక్వెల్ రూపుదిద్దుకుంటోందట. ఆల్రెడీ స్క్రిప్టు పనులు పూర్తయ్యాయనీ సమాచారం.
ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో నాగచైతన్యే కానీ, హీరోయిన్ సమంత కాదంట. రష్మికను హీరోయిన్గా తీసుకోబోతున్నారనీ తెలుస్తోంది. చై, సామ్ పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను ఈ సీక్వెల్లో చూపించబోతున్నారనీ టాక్ నడుస్తోంది.చూడాలి మరి.ఇది జస్ట్ ప్రచారమేనా.? నిజంగానే వారి వైవాహిక, విడాకుల జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చూపిస్తారా.? అన్నది తెలియాలంటే ఇంకా చాలా టైమ్ వెయిట్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!







