'స్టాప్' సైన్ ఉల్లంఘిస్తే Dh1,000, 10 బ్లాక్ పాయింట్లు
- January 02, 2023
యూఏఈ:సెలవులు ముగియడంతో విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వస్తున్నందున వాహనదారులు జాగ్రత్తగా నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అబుధాబి పోలీసులు కోరారు. పాఠశాల బస్సులో విద్యార్థులను దింపుతున్నప్పుడు లేదా ఎక్కించేటప్పుడు 'స్టాప్' గుర్తు తెరిచినప్పుడు వాహనదారులు తమ వాహనాలను పూర్తిగా ఆపివేయాలని కోరారు. అబుధాబి పోలీసులు వాహనదారులకు 'స్టాప్' గుర్తును ప్రదర్శించినప్పుడు రహదారిపై వామనాలు ఆపాలని, విద్యార్థులు సురక్షితంగా వెళ్లేలా పాఠశాల బస్సు నుండి వాహనాలను ఐదు మీటర్ల దూరంలో నిలిపివేయాలని సూచించారు. హించాలని గుర్తు చేశారు. స్టాప్ సిగ్నల్ ను పట్టించుకోని వాహనదారులకు 1,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని, వారి లైసెన్స్లకు వ్యతిరేకంగా పది బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు. అలాగే పాఠశాల బస్సు డ్రైవర్లు విద్యార్థులను ఎక్కించేటప్పుడు లేదా దింపుతున్నప్పుడు తప్పనిసారిగా 'స్టాప్' సంకేతాలను ప్రదర్శించాలన్నారు. అలా చేయని డ్రైవర్లకు 500 దిర్హామ్ జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లు విధిస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, పాఠశాలల వద్ద వాహనాలను పార్కింగ్ చేయడానికి నిర్దేశించిన స్థలాలను ఉపయోగించుకోవాలన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







