'స్టాప్' సైన్ ఉల్లంఘిస్తే Dh1,000, 10 బ్లాక్ పాయింట్లు
- January 02, 2023
యూఏఈ:సెలవులు ముగియడంతో విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వస్తున్నందున వాహనదారులు జాగ్రత్తగా నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అబుధాబి పోలీసులు కోరారు. పాఠశాల బస్సులో విద్యార్థులను దింపుతున్నప్పుడు లేదా ఎక్కించేటప్పుడు 'స్టాప్' గుర్తు తెరిచినప్పుడు వాహనదారులు తమ వాహనాలను పూర్తిగా ఆపివేయాలని కోరారు. అబుధాబి పోలీసులు వాహనదారులకు 'స్టాప్' గుర్తును ప్రదర్శించినప్పుడు రహదారిపై వామనాలు ఆపాలని, విద్యార్థులు సురక్షితంగా వెళ్లేలా పాఠశాల బస్సు నుండి వాహనాలను ఐదు మీటర్ల దూరంలో నిలిపివేయాలని సూచించారు. హించాలని గుర్తు చేశారు. స్టాప్ సిగ్నల్ ను పట్టించుకోని వాహనదారులకు 1,000 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని, వారి లైసెన్స్లకు వ్యతిరేకంగా పది బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు. అలాగే పాఠశాల బస్సు డ్రైవర్లు విద్యార్థులను ఎక్కించేటప్పుడు లేదా దింపుతున్నప్పుడు తప్పనిసారిగా 'స్టాప్' సంకేతాలను ప్రదర్శించాలన్నారు. అలా చేయని డ్రైవర్లకు 500 దిర్హామ్ జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లు విధిస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, పాఠశాలల వద్ద వాహనాలను పార్కింగ్ చేయడానికి నిర్దేశించిన స్థలాలను ఉపయోగించుకోవాలన్నారు.
తాజా వార్తలు
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!







