రైతుల మార్కెట్ను సందర్శించిన 60,000 మంది
- January 02, 2023
బహ్రెయిన్: డిసెంబర్ 10న ప్రారంభమైన బహ్రెయిన్ రైతుల మార్కెట్ కు సందర్శకులు పోటెత్తారు.నాలుగు వారాల్లో సుమారు 60,000కుపైగా ప్రజలు, నివాసితులు, పర్యాటకులు సందర్శించారు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (NIAD) భాగస్వామ్యంతో మునిసిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ మార్కెట్ని నిర్వహిస్తుంది.ఈ సంవత్సరం ఎడిషన్లో బహ్రెయిన్ రైతులు, వ్యవసాయ కంపెనీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతోపాటు కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడం మార్కెట్ను మరింత పెంచడానికి దోహదపడ్డాయని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత బహ్రెయిన్ రైతు మార్కెట్ తిరిగి ఊపందుకోవడంపై రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బహ్రెయిన్ రైతుల మార్కెట్ ప్రతి శనివారం బుదయ్య బొటానికల్ గార్డెన్లో ఉదయం 07:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







