ఈ ఏడాది చివర్లో అల్ ముతాహిదా టవర్ ప్రారంభం
- April 28, 2016
వివా బహ్రియాలోని 'పెరల్ ఖతార్ ఐకానిక్ టవర్ అల్ ముతాహిదా' ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. యునైటెడ్ డెవలప్మెంట్ కంపెనీ (యుడిసి) మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ హుస్సేన్ అక్బర్ అల్ బకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రముఖ ఖతార్ షేల్ హోల్డింగ్ కంపెనీ అయిన యుడిసి మరియు మాస్టర్ డెవలపర్ ఆఫ్ ది పెరల్ ఖతార్, మూడు రోజులపాటు జరిగే సిటీస్కేప్ 2016, దోహా ఎగ్జిబిషన్లో అల్ మతాహిదా సహా పలు ప్రాజెక్టులను, ప్రాపర్టీలను ప్రదర్శనకు ఉంచాయి. సిగ్నేచర్ టవర్లో మిగతా టవర్స్కి భిన్నంగా లగ్జరీ లెవల్లో ఉంటాయని అల్ బకర్ చెప్పారు. సరికొత్త పేమెంట్ ప్లాన్స్తో యుడిసి ఆఫర్ చేస్తోందనీ, కొనుగోలుదారులకు ఇదెంతో సులువుగా ఉంటుందని ఆయన వివరించారు. యుడిసికి చెందిన మదీనా సెంట్రాలె ప్రాజెక్ట్లో 95 శాతం ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. ఇందులో 538 మెడిటెర్రానీన్ స్టైల్ మిడ్ రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. రిటైల్ విభాగానికి సంబంధించి 700,000 చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉంటుంది. ఇండోర్ షాపింగ్ కాంప్లెక్స్ ఇందులో మరో ప్రధాన ఆకర్షణ. జూన్ లేదా జులైలో యుడిసి అబ్రాజ్ క్వార్టీయర్ టవర్స్ని ష్ట్రప్రారంభించనుంది. ఇందులో 42 స్టోరీ టవర్స్ ఉంటాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







