వివాదాస్పద వ్యాఖ్యలు: టీచర్కి 500,000 దిర్హామ్ల ఫైన్
- April 28, 2016
రిటైర్డ్ టీచర్కి 500,000 ఫైన్ విధించింది న్యాయస్థానం. ఆమె తన అంకుల్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యల్ని వాట్సాప్లో పంపారు. నిందితురాలికి మెటర్నల్ అంకుల్ బాధితుడు వేరే మతానికి చెందిన వ్యక్తి. దాంతో, మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా కూడా వాట్సాప్లో మెసేజ్లను పంపింది బాధితురాలు. నవంబర్ 2015 నుండి జనవరి 2016 వరకు ఈ మెసేజ్ల ప్రసహనం నడిచింది. తాను బాధ్యతగల టీచర్ ఉద్యోగంలో ఉన్నాననీ, తనకు అన్నీ తెలుసనీ, విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ తనను మెచ్చుకునేవారనీ, 29 ఏళ్ళుగా టీచర్గా పనిచేశానని, అయితే తనను ఆ వ్యక్తి వేధింపులకు గురిచేయడమే కాకుండా, తన వద్ద డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తి తనను అవమానపర్చాడనీ, తాను క్యాన్సర్తో బాధపడుతున్నా తనపై వేధింపులు కొనసాగించడంతోనే తన ఆగ్రహాన్ని మెసేజ్లు పంపడం ద్వారా తీర్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ న్యాయస్థానానికి తెలిపారు. బాధిత అంకుల్, మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా తిట్టడంతోపాటు తనను అవమానించిందంటూ న్యాయస్థానానికి తెలియజేశాడు.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







