అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్‌ అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని మోదీ..

- April 28, 2016 , by Maagulf
అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్‌ అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని మోదీ..

భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. నావిగేషన్‌ వ్యవస్థలో ఏడో ఉపగ్రహ ప్రయోగం పూర్తి కావడంతో దేశంలో సమూల మార్పులు వస్తాయన్నారు. ఈ ఉప్రగహ ప్రయోగంతో దేశానికి సొంత జీపీఎస్‌ వ్యవస్థ ఏర్పాటైందన్నారు. సామాన్యుల జీవితాలు, వ్యవస్థల్లో మార్పుల కోసం అంతరిక్ష పరిజ్ఞానం దోహదపడుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.ఈ ఉప్రగహ ప్రయోగం విజయవంతంతో 1500 చ.కి.మీ పరిధిలో నావిగేషన్‌ వ్యవస్థ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీని ద్వారా ఏ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చన్నారు. సొంతంగా నావినేషన్‌ వ్యవస్థ కలిగిన ఐదు దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలవడం గర్వకారణంగా ఉందని మోదీ అన్నారు. ఇస్రో సేవలు మన దేశానికే కాకుండా, సార్క్‌ దేశాలకు కూడా అందించాలని మోదీ సూచించారు. ఇస్రో విజయాలు ఇలాగే కొనసాగితే అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్‌ అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com