అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని మోదీ..
- April 28, 2016
భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. నావిగేషన్ వ్యవస్థలో ఏడో ఉపగ్రహ ప్రయోగం పూర్తి కావడంతో దేశంలో సమూల మార్పులు వస్తాయన్నారు. ఈ ఉప్రగహ ప్రయోగంతో దేశానికి సొంత జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటైందన్నారు. సామాన్యుల జీవితాలు, వ్యవస్థల్లో మార్పుల కోసం అంతరిక్ష పరిజ్ఞానం దోహదపడుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.ఈ ఉప్రగహ ప్రయోగం విజయవంతంతో 1500 చ.కి.మీ పరిధిలో నావిగేషన్ వ్యవస్థ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీని ద్వారా ఏ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చన్నారు. సొంతంగా నావినేషన్ వ్యవస్థ కలిగిన ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలవడం గర్వకారణంగా ఉందని మోదీ అన్నారు. ఇస్రో సేవలు మన దేశానికే కాకుండా, సార్క్ దేశాలకు కూడా అందించాలని మోదీ సూచించారు. ఇస్రో విజయాలు ఇలాగే కొనసాగితే అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







