కువైట్ ఇండియన్ ఎంబసీలో జనవరి 9న ‘ప్రవాసీ దివస్’ లైవ్ స్ట్రీమింగ్
- January 06, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం 2023 జనవరి 9, 10 తేదీల్లో ఎంబసీ ఆడిటోరియంలో 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. భారతీయ కువైట్ ఎంబసీలో 9వ తేదీన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే లైవ్ స్ట్రీమింగ్లో చేరాలని ఎంబసీ భారతీయ పౌరులందరినీ ఆహ్వానిస్తుంది.10వ తేదీన మధ్యాహ్నం 1:00 నుండి 2:30 వరకు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 08 - 10 జనవరి 2023 వరకు జరుగుతుంది. గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 09న ప్రారంభ సెషన్లో పాల్గొని ప్రసంగిస్తారు. జనవరి 10వ తేదీన గౌరవనీయులైన రాష్ట్రపతి పాల్గొని ప్రసంగిస్తారు.
భారత ప్రభుత్వంతో ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ సంబంధాలను బలోపేతం చేయడానికి, వారి మూలాలతో తిరిగి కనెక్ట్ చేయడానికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రవాసీ భారతీయ దివస్ ను జరుపుకుంటారు. ఇండోర్లో జరిగే 17వ PBD సమావేశానికి ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో NRIలు హాజరవుతారు.ఈ సారి కన్వెన్షన్ ను "డయాస్పోరా: రిలియబుల్ పార్టనర్స్ ఫర్ ఇండియా ప్రొగ్రెస్ ఇన్ అమృత్ కాల్" థీమ్ తో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









