చిరంజీవి చేతులు మీదగా అవార్డుని అందుకున్న అడివి శేషు..
- January 08, 2023
హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్లో అడివి శేషు ఒకడు. ఆక్టర్గా, రైటర్గా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. గూఢచారి సినిమాతో మొదలైన తన విజయ పరంపరాని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాడు. గత ఏడాదిలో ఈ హీరో ‘మేజర్’, ‘హిట్-2’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకున్నాడు. తాజాగా అడివి శేషు తన అభిమాన హీరో చిరంజీవి చేతులు మీదగా అవార్డుని అందుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
ముంబై తాజ్ హోటల్ ఉగ్రవాదులను ఎదిరించి పోరాడిన ‘మేజర్ ఉన్ని కృష్ణన్’ బయోపిక్ ని ‘మేజర్’గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అడివి శేషు చాలా కష్టపడ్డాడు. నటుడు గానే కాదు రైటర్ గా కూడా ఈ సినిమా విజయంలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు. కాగా ప్రతి ఏటా టాలీవుడ్ యాక్టర్స్ కి సంతోషం అవార్డ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పురస్కారాల్లో అడివి శేషు మేజర్ సినిమాకు గాను అవార్డుని అందుకున్నాడు.
ఆ అవార్డుని చిరు చేతులు మీదగా అందుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ట్విట్టర్ లో.. ‘చిన్నప్పుడు మీ సినిమా టికెట్లు కోసం కొట్టుకునే వాళ్ళం.అలాంటి మీరు ఒక హాఫ్ డే అంతా మా మేజర్ సినిమా గురించి మాట్లాడడం నాకు చాల గర్వంగా ఉంది. ఇక ఇప్పుడు మీ చేతులు మీదగా ఆ సినిమాకి అవార్డుని అందుకోవడం నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అవార్డుని అందుకుంటున్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







