చిరంజీవి చేతులు మీదగా అవార్డుని అందుకున్న అడివి శేషు..
- January 08, 2023
హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్లో అడివి శేషు ఒకడు. ఆక్టర్గా, రైటర్గా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. గూఢచారి సినిమాతో మొదలైన తన విజయ పరంపరాని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాడు. గత ఏడాదిలో ఈ హీరో ‘మేజర్’, ‘హిట్-2’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకున్నాడు. తాజాగా అడివి శేషు తన అభిమాన హీరో చిరంజీవి చేతులు మీదగా అవార్డుని అందుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
ముంబై తాజ్ హోటల్ ఉగ్రవాదులను ఎదిరించి పోరాడిన ‘మేజర్ ఉన్ని కృష్ణన్’ బయోపిక్ ని ‘మేజర్’గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అడివి శేషు చాలా కష్టపడ్డాడు. నటుడు గానే కాదు రైటర్ గా కూడా ఈ సినిమా విజయంలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు. కాగా ప్రతి ఏటా టాలీవుడ్ యాక్టర్స్ కి సంతోషం అవార్డ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పురస్కారాల్లో అడివి శేషు మేజర్ సినిమాకు గాను అవార్డుని అందుకున్నాడు.
ఆ అవార్డుని చిరు చేతులు మీదగా అందుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ట్విట్టర్ లో.. ‘చిన్నప్పుడు మీ సినిమా టికెట్లు కోసం కొట్టుకునే వాళ్ళం.అలాంటి మీరు ఒక హాఫ్ డే అంతా మా మేజర్ సినిమా గురించి మాట్లాడడం నాకు చాల గర్వంగా ఉంది. ఇక ఇప్పుడు మీ చేతులు మీదగా ఆ సినిమాకి అవార్డుని అందుకోవడం నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అవార్డుని అందుకుంటున్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.
తాజా వార్తలు
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్లో కేర్ గివర్స్కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ







