1.5 మిలియన్లు గెలుచుకున్న ఇండియన్ నేషనల్

- January 08, 2023 , by Maagulf
1.5 మిలియన్లు గెలుచుకున్న ఇండియన్ నేషనల్

కువైట్: కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ నిర్వహించిన అల్ నజ్మా ఖాతా డ్రాలో ఇండియన్ నేషనల్ మలయిల్ మూసా కోయా బహుమతిని గెలుచుకున్నారు. మూసా కోయా గురువారం మూరూజ్‌లో జరిగిన మెగా డ్రాలో సుమారు 40 కోట్ల రూపాయల విలువైన 1.5 మిలియన్ దినార్‌లను గెలుచుకున్నాడు. కేరళకు చెందిన మూసా కోయా.. కువైట్ టైమ్స్ వార్తాపత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్, మంగాఫ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com