సౌదీలో కవలలను విజయవంతంగా వేరు చేసిన వైద్య బృందం
- January 08, 2023
రియాద్: 28 మంది వైద్యులు, నిపుణులు, నర్సులు, ఇతర వైద్య నిపుణులతో కూడిన వైద్య బృందం సౌదీ అరేబియాలో కలిసిపోయి పుట్టిన కవలలను విజయవంతంగా వేరు చేసింది. దాదాపు ఏడు గంటలపాటు నిర్వహించిన ఆపరేషన్ ఏడు దశలుగా సాగింది. కవల పిల్లలు ఒకే వెన్నుపామును పంచుకొని పుట్టారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు గురువారం రియాద్లో శస్త్రచికిత్స జరిగింది. రాయల్ కోర్ట్ సలహాదారు, కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief) సూపర్వైజర్ జనరల్ అయిన డాక్టర్ అబ్దుల్లా అల్ రబీహ్ ఆపరేషన్ విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. గత 32 సంవత్సరాలలో 23 స్నేహపూర్వక దేశాల నుండి 127 కవలల సంరక్షణను సౌదీ అరేబియా చేపట్టిందన్నారు. వైద్య రంగంలో సౌదీ అరేబియా సాధించిన ప్రగతిని ఇది హైలైట్ చేస్తుందన్నారు. ప్రస్తుతం శిశువులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు తరలించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







