అఫ్గానిస్థాన్లో ఆత్మాహుతి దాడి..
- January 12, 2023కాబుల్: అఫ్గానిస్థాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే, దాదాపు 40 మంది తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం. అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ఓ తాలిబన్ అధికారి మాత్రం.. 20 మంది మృతి చెందారని తెలిపారు.
బాంబుతో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన ఓ ఉగ్రవాది విఫలమయ్యాడు. దీంతో కార్యాలయం వెలుపలే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోనే టర్కీ, చైనాతో పాటు పలు దేశాల దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యతవహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటన చేయలేదు. అఫ్గాన్ అధికారులతో ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయంలో చైనా అధికారులు ఓ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 40 మంది గాయపడ్డారని ఇటలీకి చెందిన ఓ సంస్థ తెలిపింది.
ఈ దాడిపై కాబూల్ పోలీసులు స్పందిస్తూ దీన్ని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ బాంబు దాడులు ఆగడం లేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ