అఫ్గానిస్థాన్లో ఆత్మాహుతి దాడి..
- January 12, 2023
కాబుల్: అఫ్గానిస్థాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే, దాదాపు 40 మంది తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం. అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ఓ తాలిబన్ అధికారి మాత్రం.. 20 మంది మృతి చెందారని తెలిపారు.
బాంబుతో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన ఓ ఉగ్రవాది విఫలమయ్యాడు. దీంతో కార్యాలయం వెలుపలే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోనే టర్కీ, చైనాతో పాటు పలు దేశాల దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యతవహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటన చేయలేదు. అఫ్గాన్ అధికారులతో ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయంలో చైనా అధికారులు ఓ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 40 మంది గాయపడ్డారని ఇటలీకి చెందిన ఓ సంస్థ తెలిపింది.
ఈ దాడిపై కాబూల్ పోలీసులు స్పందిస్తూ దీన్ని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ బాంబు దాడులు ఆగడం లేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







