అఫ్గానిస్థాన్లో ఆత్మాహుతి దాడి..
- January 12, 2023
కాబుల్: అఫ్గానిస్థాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే, దాదాపు 40 మంది తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం. అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ఓ తాలిబన్ అధికారి మాత్రం.. 20 మంది మృతి చెందారని తెలిపారు.
బాంబుతో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన ఓ ఉగ్రవాది విఫలమయ్యాడు. దీంతో కార్యాలయం వెలుపలే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోనే టర్కీ, చైనాతో పాటు పలు దేశాల దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యతవహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటన చేయలేదు. అఫ్గాన్ అధికారులతో ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయంలో చైనా అధికారులు ఓ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 40 మంది గాయపడ్డారని ఇటలీకి చెందిన ఓ సంస్థ తెలిపింది.
ఈ దాడిపై కాబూల్ పోలీసులు స్పందిస్తూ దీన్ని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ బాంబు దాడులు ఆగడం లేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







