గంగా విలాస్ క్రూయిజ్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
- January 13, 2023
ప్రపంచం లోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు.అదే విధంగా వారణాసిలోని గంగా నది ఒడ్డున ‘టెన్త్ సిటీ’ని, అదేవిధంగా కోట్ల నిధులతో అనేక ఇతర అంతర్గత జల మార్గాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు భారతదేశంలో పర్యాటక రంగానికి కొత్త యుగానికి నాంది పలుకుతుందని చెప్పారు.
గంగా నంది పై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ ప్రారంభం కావటం ఒక మైలురాయి అని ప్రధాని మోదీ అన్నారు. గంగా నది మనకు కేవలం నది మాత్రమే కాదని, ప్రాచీన కాలం నుంచి గుర్తులకు సాక్షిగా నిలుస్తోందని తెలిపారు. గంగామాత భారతీయులను ఎల్లవేళలా పెంచి పోషించిందని అన్నారు. అయితే, స్వాతంత్ర్యానంతరం నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు లక్షలాది మంది వలసబాట పట్టారని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అ వసరం ఉందని అన్నారు.ఈ క్రమంలోనే ఒకవైపు నమామి గంగ పేరుతో గంగానది పరిశుభ్రతకు కృషి చేశామని మోదీ గుర్తు చేశారు.
గంగా విలాస్లో ప్రయాణిస్తున్న విదేశీ పర్యాటకులకు మీరు ఊహించగలవన్నీ భారతదేశంలో ఉన్నాయని మోదీ తెలిపారు. ఇదిలాఉంటే ఎంవీ గంగా విలాస్కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్గా గంగా విలాస్కు పేరుంది. ఇది 51 రోజులు దాదాపు 3,200 కి.మీ పైగా ప్రయాణిస్తుంది. 36 మంది పర్యాటకులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. విలాసవంతమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. బంగ్లాదేశ్, ఇండియాల్లో 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ క్రూయిజ్ ప్రయాణిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







