మక్కా గ్రాండ్ మస్జీదుకు ఉచిత షటిల్ సేవలు ప్రారంభం
- January 13, 2023
జెద్దా: జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం యాత్రికుల కోసం ఉచిత షటిల్ సేవను ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ యాత్రికులను విమానాశ్రయంలోని టెర్మినల్ 1 నుండి మక్కాలోని గ్రాండ్ మస్జీదుకు తీసుకువెళుతుందని విమానాశ్రయం ట్విట్టర్లో ప్రకటించింది. "లబ్ధిదారులు తప్పనిసరిగా ఇహ్రామ్ ధరించాలి. సౌదీల కోసం జాతీయ ID లేదా విదేశీయుల పాస్పోర్ట్ను తప్పనిసరిగా సమర్పించాలి." అని తన ట్వీట్ లో పేర్కొంది. విమానాశ్రయం నుండి ప్రతి రెండు గంటలకు ఒక సర్వీసు ప్రారంభం అవుతుంది. ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు షటిల్ సర్వీసుల సేవలు అందుబాటులో ఉంటాయి. తిరిగి మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు గ్రాండ్ మస్జీదు నుండి షటిల్ సర్వీసులు తిరుగు ప్రయాణం అవుతాయి.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







