వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసిన సీఎం కేసీఆర్
- January 13, 2023
హైదరాబాద్: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కంటి వెలుగు పథకం రెండవ విడత కార్యక్రమం ప్రారంభం కానున్న తరుణంలో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఆదేశించారు. ఈ కార్యక్రమం కొనసాగినన్ని రోజులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ రోజు తప్ప మిగిలి అన్ని రోజులు వైద్య సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమాలలో పాల్గొనాలని ఆదేశాలు జారీచేసింది. సోమవారం కూడా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఎవరైనా విధులకు హాజరు కాకపోతే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది వైద్యశాఖ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కంటి వెలుగు పధకం మళ్లీ ప్రారంభం కాబోతుంది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 తేదీ నుంచి రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం మొదలుకాబోతుంది. ఇప్పటికే పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ల నియామకానికి మార్గదర్శకాలను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. కంటి వెలుగు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1491 వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి రూ. 200 కోట్ల నిధులను విడుదల చేసింది. అందరు కలిసి ఉత్సాహంగా పని చేసి కంటి వెలుగు-2ని విజయవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కోరడం జరిగింది.
తాజా వార్తలు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్









