‘వీరయ్య’ ఎంట్రీతో ‘వీరసింహం’ గర్జన మూగబోయిందే.!
- January 14, 2023ఈ ఏడాది సంక్రాంతి సినీ ప్రియులకు ఎక్కడ లేని పండగ తీసుకురాబోతోందనే ఆసక్తి కలిగించింది. చాలా కాలం తర్వాత చిరంజీవి, బాలయ్యలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగడమే అందుకు కారణం.
‘వీర సింహారెడ్డి’గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నందమూరి బాలకృష్ణ. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయ్. బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ లెక్క ఈ సినిమాని పండగ చేసుకున్నారు.
ఒక్క రోజు గ్యాప్లో అంటే, జనవరి 13న ‘వాల్తేర్ వీరయ్య’ ఎంట్రీ ఇచ్చాడు. ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు పోలికలు సర్వ సాధారణం. అలా ముందుగా వచ్చిన బాలయ్య సినిమాతో, చిరంజీవి సినిమాని పోల్చుకున్నారు అభిమానులు.
ఎంటర్టైన్మెంట్, మాస్ కంటెంట్.. ఇలా ‘వీరసింహారెడ్డి’తో పోల్చితే, ‘వీరయ్య’ లో అదనంగా వుండడంతో, ఈ సినిమాకి ఎక్కువ ఆదరణ లభించిందని టాక్ వినిపిస్తోంది. అసలు సిసలు సంక్రాంతి సినిమా ‘వీరయ్య’నే అనీ, సంక్రాంతి హీరో మెగాస్టార్ అనీ సినీ మేధావుల్లో టాక్ వినిపిస్తోంది.
ఏది ఏమైనా సంక్రాంతి సీజన్లో ఏ సినిమా అయినా కొట్టుకుపోతుంది. ఇరు హీరోల అభిమానులూ రెండు సినిమాల్నీ అమితంగా ఆదరిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







