‘వీరయ్య’ ఎంట్రీతో ‘వీరసింహం’ గర్జన మూగబోయిందే.!
- January 14, 2023ఈ ఏడాది సంక్రాంతి సినీ ప్రియులకు ఎక్కడ లేని పండగ తీసుకురాబోతోందనే ఆసక్తి కలిగించింది. చాలా కాలం తర్వాత చిరంజీవి, బాలయ్యలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగడమే అందుకు కారణం.
‘వీర సింహారెడ్డి’గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నందమూరి బాలకృష్ణ. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయ్. బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ లెక్క ఈ సినిమాని పండగ చేసుకున్నారు.
ఒక్క రోజు గ్యాప్లో అంటే, జనవరి 13న ‘వాల్తేర్ వీరయ్య’ ఎంట్రీ ఇచ్చాడు. ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు పోలికలు సర్వ సాధారణం. అలా ముందుగా వచ్చిన బాలయ్య సినిమాతో, చిరంజీవి సినిమాని పోల్చుకున్నారు అభిమానులు.
ఎంటర్టైన్మెంట్, మాస్ కంటెంట్.. ఇలా ‘వీరసింహారెడ్డి’తో పోల్చితే, ‘వీరయ్య’ లో అదనంగా వుండడంతో, ఈ సినిమాకి ఎక్కువ ఆదరణ లభించిందని టాక్ వినిపిస్తోంది. అసలు సిసలు సంక్రాంతి సినిమా ‘వీరయ్య’నే అనీ, సంక్రాంతి హీరో మెగాస్టార్ అనీ సినీ మేధావుల్లో టాక్ వినిపిస్తోంది.
ఏది ఏమైనా సంక్రాంతి సీజన్లో ఏ సినిమా అయినా కొట్టుకుపోతుంది. ఇరు హీరోల అభిమానులూ రెండు సినిమాల్నీ అమితంగా ఆదరిస్తున్నారు.
తాజా వార్తలు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!
- విమాన సర్వీసుల పై భారత్, కువైట్ చర్చలు..!!
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్









