జల్లికట్టు పోటీలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి..
- January 15, 2023
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. జల్లికట్టు పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఇవాళ జల్లి కట్టు పోటీలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. జల్లికట్టుకు మదురై సిద్ధమయింది. మధురై జిల్లాలోని అవనియాపురంలో జల్లికట్టు పోటీలకు ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ప్రాంతంలో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. తొలి జల్లికట్టు క్రీడకు అవనియాపురం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులోని అవనియాపురం, సాలమేడు, అలంగనూరు ప్రాంతాల్లో ప్రాచీన సాహస క్రీడ జల్లికట్టును నిర్వహిస్తున్నారు.
ఇక అవనియాపురం జల్లికట్టులో ఏళ్ల తరబడి నిర్వహిస్తూ వచ్చిన తెంకాలు సాగునీటి రైతుల సంఘానికి, అవనియాపురం గ్రామ కమిటీకి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఈ సారి జల్లికట్లు పోటీలను జిల్లా యంత్రాంగం, పురపాలక సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల నిర్వహణకు పురపాలక సంఘం రూ.17 లక్షల టెండర్ ను పిలిచి మరీ ఏర్పాటు చేసింది. వారివాసలు నిర్మించి బారికేడ్లను ఏర్పాటు చేయడం, ప్రేక్షకుల గ్యాలరీ, వెటనరీ పరిశీలన కేంద్రాలు,ఇవాళ జరిగే జల్లికట్టు క్రీడలో 800 ఎద్దులు పాల్గొంటున్నాయి.
వీటిని అణిచివేయడానికి మధురై, శివగంగై, దెండుగల్, తేని తదితర జిల్లాలకు చెందిన 400 మంది సాహస క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిని రౌండ్ల వారిగా జల్లికట్టు మైదానంలోకి అనుమతించనున్నారు. ఎద్దులను అణిచివేసే క్రీడాకారులకు ఎవరికి పట్టు చిక్కకుండా తప్పించుకునే ఎత్తుల యజమానులకు బహుమతులు ప్రధానం చేయనున్నారు.
సైకిళ్లు, బీరువాలు, బంగారు కాసులు తదితర కానులను వీరికి అందిస్తారు. జల్లికట్టుకు సంబంధించి హెల్త్ డిపార్ట్ మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జల్లికట్టులో గాయపడిన వారికి తక్షణం చికిత్స అందించడానికి వైద్య బృందాలు రెడీగా ఉన్నాయి. ఆరు అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. ఈ పోటీల్లో గొడవలు జరుగకుండా భద్రతా కూడా పెంచారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







