పురావస్తు ప్రదేశాల సందర్శన ప్రవేశ రుసుములు ఖరారు
- January 15, 2023
మస్కట్: కోటలు, చారిత్రక ప్రదేశాలు, కేంద్రాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించేందుకు ప్రవేశ రుసుములను వారసత్వ, సాంస్కృతిక శాఖ ఖరారు చేసింది. పురావస్తు ప్రదేశాలకు ప్రవేశ రుసుము 6-12 సంవత్సరాల వయస్సు గల ఒమానీలకు 200 బైసాలు, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 1గా నిర్ణయించారు. సుల్తానేట్ నివాసుల విషయానికొస్తే 6-12 సంవత్సరాల వయస్సు గల సందర్శకులకు టిక్కెట్ విలువ 500 బైసాలు, 12 ఏళ్లు పైబడిన వారికి OMR 1గా పేర్కొన్నారు. నాన్-రెసిడెంట్స్ విషయంలో 6-12 సంవత్సరాల వయస్సు వారికి OMR 1, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 3 గా నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రైవేట్ రంగం ఆధీనంలో ఉన్న కోటలను ఈ నిర్ణయం నుండి మినహాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రవేశ రుసుముల నుంచి అధికారిక ప్రభుత్వ ప్రతినిధులు, విద్యా సంస్థలు నిర్వహించే పాఠశాల పర్యటనలకు మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







