పురావస్తు ప్రదేశాల సందర్శన ప్రవేశ రుసుములు ఖరారు
- January 15, 2023
మస్కట్: కోటలు, చారిత్రక ప్రదేశాలు, కేంద్రాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించేందుకు ప్రవేశ రుసుములను వారసత్వ, సాంస్కృతిక శాఖ ఖరారు చేసింది. పురావస్తు ప్రదేశాలకు ప్రవేశ రుసుము 6-12 సంవత్సరాల వయస్సు గల ఒమానీలకు 200 బైసాలు, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 1గా నిర్ణయించారు. సుల్తానేట్ నివాసుల విషయానికొస్తే 6-12 సంవత్సరాల వయస్సు గల సందర్శకులకు టిక్కెట్ విలువ 500 బైసాలు, 12 ఏళ్లు పైబడిన వారికి OMR 1గా పేర్కొన్నారు. నాన్-రెసిడెంట్స్ విషయంలో 6-12 సంవత్సరాల వయస్సు వారికి OMR 1, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 3 గా నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రైవేట్ రంగం ఆధీనంలో ఉన్న కోటలను ఈ నిర్ణయం నుండి మినహాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రవేశ రుసుముల నుంచి అధికారిక ప్రభుత్వ ప్రతినిధులు, విద్యా సంస్థలు నిర్వహించే పాఠశాల పర్యటనలకు మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







