పురావస్తు ప్రదేశాల సందర్శన ప్రవేశ రుసుములు ఖరారు
- January 15, 2023
మస్కట్: కోటలు, చారిత్రక ప్రదేశాలు, కేంద్రాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించేందుకు ప్రవేశ రుసుములను వారసత్వ, సాంస్కృతిక శాఖ ఖరారు చేసింది. పురావస్తు ప్రదేశాలకు ప్రవేశ రుసుము 6-12 సంవత్సరాల వయస్సు గల ఒమానీలకు 200 బైసాలు, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 1గా నిర్ణయించారు. సుల్తానేట్ నివాసుల విషయానికొస్తే 6-12 సంవత్సరాల వయస్సు గల సందర్శకులకు టిక్కెట్ విలువ 500 బైసాలు, 12 ఏళ్లు పైబడిన వారికి OMR 1గా పేర్కొన్నారు. నాన్-రెసిడెంట్స్ విషయంలో 6-12 సంవత్సరాల వయస్సు వారికి OMR 1, 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి OMR 3 గా నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రైవేట్ రంగం ఆధీనంలో ఉన్న కోటలను ఈ నిర్ణయం నుండి మినహాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ప్రవేశ రుసుముల నుంచి అధికారిక ప్రభుత్వ ప్రతినిధులు, విద్యా సంస్థలు నిర్వహించే పాఠశాల పర్యటనలకు మినహాయింపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







