స్నాప్చాట్ లో లగ్జరీ వాచ్ ప్రకటన.. 80,000 దిర్హామ్లు మోసం
- January 15, 2023
యూఏఈ: స్నాప్ చాట్ లో లగ్జరీ వాచ్ అమ్మకం పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. 80,000 దిర్హామ్లకు లగ్జరీ వాచ్ ను అమ్ముతానని ఓ వ్యక్తి తనను మోసం చేశాడని బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన కోర్టు.. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని నిందితుడికి సూచించింది. అబుధాబి అప్పీల్స్ కోర్టు సివిల్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. స్నాప్చాట్ ద్వారా ఒప్పందం కుదిరిందని, 80,000 దిర్హామ్లకు వాచ్ని కొనుగోలు చేసేందుకు వీలుగా నిందితుడి బ్యాంక్ ఖాతాకు మొత్తాన్ని బదిలీ చేశానని, ఆ తర్వాత వాచ్ ఇవ్వకుండా నిందితుడు తనన మోసం చేసినట్లు బాధితుడు కోర్టు పత్రాల్లో పేర్కొన్నాడు. అలాగే తనకు జరిగిన మానసిక వేధనకు 20,000 దిర్హామ్లను పరిహారంగా చెల్లించాలని కోర్టుకు విన్నవించాడు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు.. సివిల్ అప్పీల్ కోర్టు న్యాయమూర్తి మొదటి కోర్టు ఇచ్చిన మునుపటి తీర్పును సమర్థించారు. ఫిర్యాదుదారు నుండి తీసుకున్న Dh80,000 తిరిగి చెల్లించాలని ప్రతివాదిని ఆదేశించారు. మరో 5,000 దిర్హామ్లు నష్టపరిహారం చెల్లించాలన్నారు. వీటితోపాటు చట్టపరమైన ఖర్చులకు కూడా చెల్లించాలని నిందితుడిని ఆదేశించారు.
తాజా వార్తలు
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం







