స్నాప్చాట్ లో లగ్జరీ వాచ్ ప్రకటన.. 80,000 దిర్హామ్లు మోసం
- January 15, 2023
యూఏఈ: స్నాప్ చాట్ లో లగ్జరీ వాచ్ అమ్మకం పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. 80,000 దిర్హామ్లకు లగ్జరీ వాచ్ ను అమ్ముతానని ఓ వ్యక్తి తనను మోసం చేశాడని బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన కోర్టు.. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని నిందితుడికి సూచించింది. అబుధాబి అప్పీల్స్ కోర్టు సివిల్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. స్నాప్చాట్ ద్వారా ఒప్పందం కుదిరిందని, 80,000 దిర్హామ్లకు వాచ్ని కొనుగోలు చేసేందుకు వీలుగా నిందితుడి బ్యాంక్ ఖాతాకు మొత్తాన్ని బదిలీ చేశానని, ఆ తర్వాత వాచ్ ఇవ్వకుండా నిందితుడు తనన మోసం చేసినట్లు బాధితుడు కోర్టు పత్రాల్లో పేర్కొన్నాడు. అలాగే తనకు జరిగిన మానసిక వేధనకు 20,000 దిర్హామ్లను పరిహారంగా చెల్లించాలని కోర్టుకు విన్నవించాడు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు.. సివిల్ అప్పీల్ కోర్టు న్యాయమూర్తి మొదటి కోర్టు ఇచ్చిన మునుపటి తీర్పును సమర్థించారు. ఫిర్యాదుదారు నుండి తీసుకున్న Dh80,000 తిరిగి చెల్లించాలని ప్రతివాదిని ఆదేశించారు. మరో 5,000 దిర్హామ్లు నష్టపరిహారం చెల్లించాలన్నారు. వీటితోపాటు చట్టపరమైన ఖర్చులకు కూడా చెల్లించాలని నిందితుడిని ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







