స్నాప్చాట్ లో లగ్జరీ వాచ్ ప్రకటన.. 80,000 దిర్హామ్లు మోసం
- January 15, 2023
యూఏఈ: స్నాప్ చాట్ లో లగ్జరీ వాచ్ అమ్మకం పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. 80,000 దిర్హామ్లకు లగ్జరీ వాచ్ ను అమ్ముతానని ఓ వ్యక్తి తనను మోసం చేశాడని బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన కోర్టు.. ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని నిందితుడికి సూచించింది. అబుధాబి అప్పీల్స్ కోర్టు సివిల్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది. స్నాప్చాట్ ద్వారా ఒప్పందం కుదిరిందని, 80,000 దిర్హామ్లకు వాచ్ని కొనుగోలు చేసేందుకు వీలుగా నిందితుడి బ్యాంక్ ఖాతాకు మొత్తాన్ని బదిలీ చేశానని, ఆ తర్వాత వాచ్ ఇవ్వకుండా నిందితుడు తనన మోసం చేసినట్లు బాధితుడు కోర్టు పత్రాల్లో పేర్కొన్నాడు. అలాగే తనకు జరిగిన మానసిక వేధనకు 20,000 దిర్హామ్లను పరిహారంగా చెల్లించాలని కోర్టుకు విన్నవించాడు. అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు.. సివిల్ అప్పీల్ కోర్టు న్యాయమూర్తి మొదటి కోర్టు ఇచ్చిన మునుపటి తీర్పును సమర్థించారు. ఫిర్యాదుదారు నుండి తీసుకున్న Dh80,000 తిరిగి చెల్లించాలని ప్రతివాదిని ఆదేశించారు. మరో 5,000 దిర్హామ్లు నష్టపరిహారం చెల్లించాలన్నారు. వీటితోపాటు చట్టపరమైన ఖర్చులకు కూడా చెల్లించాలని నిందితుడిని ఆదేశించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







