రియో ఒలింపిక్స్లో భారత బృందానికి రాయబారిగా సచిన్
- April 29, 2016
: రియో ఒలింపిక్స్లో భారత బృందానికి సహృద్భావ రాయబారిగా వ్యవహరించేందుకు క్రికెట్ లెజెండ్ సచిన్ తెందుల్కర్ను భారత ఒలింపిక్ అసోసియేషన్ ఆహ్వానిస్తోంది. ఈవిషయమై ఐఓయే సచిన్కు అధికారికంగా లేఖ పంపింది. అయితే సచిన్ దీనికి స్పందించాల్సి ఉంది.దేశ క్రీడాకారుల తరఫున మాట్లాడడానికి సచిన్ ఎప్పుడూ ముందు వరసలో నిలుస్తారు కాబట్టి రాయబారిగా వ్యవహరించడానికి అంగీకరించే అవకాశం ఉంది. బాక్సర్ సరితాయాదవ్ సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో సచిన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన ఒలింపిక్ బృందంలో చేరడం క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తుందని ఐఓఏ భావిస్తోంది.ఒలింపిక్ గేమ్స్కి ప్రజాదరణ పెంచడానికి, కార్పొరేట్లను ఆకర్షించి నిధులు రాబట్టడానికి ఐఓఎ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ను కూడా రాయబారుల బృందంలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









