రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి రాయబారిగా సచిన్‌

- April 29, 2016 , by Maagulf
రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి  రాయబారిగా సచిన్‌

: రియో ఒలింపిక్స్‌లో భారత బృందానికి సహృద్భావ రాయబారిగా వ్యవహరించేందుకు క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందుల్కర్‌ను భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆహ్వానిస్తోంది. ఈవిషయమై ఐఓయే సచిన్‌కు అధికారికంగా లేఖ పంపింది. అయితే సచిన్‌ దీనికి స్పందించాల్సి ఉంది.దేశ క్రీడాకారుల తరఫున మాట్లాడడానికి సచిన్‌ ఎప్పుడూ ముందు వరసలో నిలుస్తారు కాబట్టి రాయబారిగా వ్యవహరించడానికి అంగీకరించే అవకాశం ఉంది. బాక్సర్‌ సరితాయాదవ్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత విషయంలో సచిన్‌ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆయన ఒలింపిక్‌ బృందంలో చేరడం క్రీడాకారుల ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేస్తుందని ఐఓఏ భావిస్తోంది.ఒలింపిక్‌ గేమ్స్‌కి ప్రజాదరణ పెంచడానికి, కార్పొరేట్లను ఆకర్షించి నిధులు రాబట్టడానికి ఐఓఎ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహమాన్‌ను కూడా రాయబారుల బృందంలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com