సంస్కృతి, పర్యాటకం, క్రీడా మౌలిక సదుపాయాలకు మద్దతుగా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్
- January 17, 2023
రియాద్: రాజ్యవ్యాప్తంగా సంస్కృతి, పర్యాటకం, వినోదం, క్రీడా రంగాలకు స్థిరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ను ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి, ఈవెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (EIF) ఛైర్మన్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. స్థానిక పరిశ్రమలను పెంపొందించడానికి, విదేశీ పెట్టుబడులను పెంచడానికి, విజన్ 2030లో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్యాలను సృష్టించడం కూడా ఈ ఫండ్ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా ఇండోర్ అరేనాలు, ఆర్ట్ గ్యాలరీలు, థియేటర్లు, కాన్ఫరెన్స్ సెంటర్లు, గుర్రపు పందెం ట్రాక్లు, ఆటో రేసింగ్ ట్రాక్లను కింగ్డమ్ అంతటా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడం, చమురుయేతర GDPలో ఇతర రంగాల వాటాను పెంచడం, అలాగే వార్షిక GDPకి పర్యాటక రంగం సహకారాన్ని 10 శాతానికి(ప్రస్తుత 3 శాతం) కంటే ఎక్కువకు పెంచడం విజన్ 2030కి తాజా ఫండ్ దోహదం చేస్తుందన్నారు. రాజ్యాన్ని గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్గా మార్చడానికి మద్దతు ఇస్తుందని, 2030 నాటికి 100 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షిస్తుందని, ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే దేశాలలో ఒకటిగా చేస్తుందని క్రౌన్ ప్రిన్స్ వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







