'సుప్రీమ్‌' చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు

- April 29, 2016 , by Maagulf
'సుప్రీమ్‌' చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు

సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా జంటగా నటించిన 'సుప్రీమ్‌' చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర నిర్మాత దిల్‌రాజు సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. చిత్రానికి సెన్సార్‌ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ లభించినట్లు పేర్కొన్నారు.అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. సాయి కార్తీక్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్‌ టాక్సీ డ్రైవరుగా, రాశీఖన్నా పోలీసు అధికారిణిగా కనిపించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com