తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం: సీఎం కేజ్రీవాల్
- January 18, 2023
హైదరాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కేజ్రీవాల్కు ఘన స్వాగతం పలికాయి. కాగా బుధవారం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ కేజ్రీవాల్ను ఆహ్వానించారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను, నేతలను కలిశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల కోసం రాలేదు. కంటి వెలుగు మంచి కార్యక్రమం కాబట్టే ఇక్కడికి వచ్చామన్నారు. తెలంగాణలో ఆప్ నిర్మాణం కోసం కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







