ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- January 30, 2026
మనమా: కల్పిత వాణిజ్య రికార్డుల ద్వారా చట్టవిరుద్ధంగా వర్క పర్మిట్లను పొందిన మూడు వేర్వేరు కేసులలో ఎనిమిది మంది నిందితులను క్రిమినల్ కోర్టులు దోషులుగా నిర్ధారించాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధిపతి ప్రకటించారు.
మొదటి కేసులో.. ఐదుగురు నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఉనికిలో లేని కంపెనీలకు సంబంధించిన 51 వాణిజ్య రికార్డులను ఉపయోగించి 93 వర్క్ పర్మిట్లు పొందినట్లు తేలిన తర్వాత వారిని శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది.
రెండవ కేసులో.. 32 కల్పిత వాణిజ్య రికార్డుల ద్వారా 61 వర్క్ పర్మిట్లను చట్టవిరుద్ధంగా పొందినందుకు ఒక నిందితుడికి 61,000 దినార్ల జరిమానా మరియు శాశ్వతంగా బహిష్కరణ వేటు వేసింది.
మూడవ కేసులో.. కల్పిత కంపెనీల కింద నమోదు చేయబడిన 21 వాణిజ్య రికార్డుల ద్వారా 42 వర్క్ పర్మిట్లను పొందినందుకు కోర్టు మొదటి నిందితుడికి 40,000 దినార్ల జరిమానా మరియు రెండవ నిందితుడికి 2,000 దినార్ల జరిమానాతో పాటు శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..







