ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- January 30, 2026
మనమా: కల్పిత వాణిజ్య రికార్డుల ద్వారా చట్టవిరుద్ధంగా వర్క పర్మిట్లను పొందిన మూడు వేర్వేరు కేసులలో ఎనిమిది మంది నిందితులను క్రిమినల్ కోర్టులు దోషులుగా నిర్ధారించాయని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధిపతి ప్రకటించారు.
మొదటి కేసులో.. ఐదుగురు నిందితులకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. ఉనికిలో లేని కంపెనీలకు సంబంధించిన 51 వాణిజ్య రికార్డులను ఉపయోగించి 93 వర్క్ పర్మిట్లు పొందినట్లు తేలిన తర్వాత వారిని శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది.
రెండవ కేసులో.. 32 కల్పిత వాణిజ్య రికార్డుల ద్వారా 61 వర్క్ పర్మిట్లను చట్టవిరుద్ధంగా పొందినందుకు ఒక నిందితుడికి 61,000 దినార్ల జరిమానా మరియు శాశ్వతంగా బహిష్కరణ వేటు వేసింది.
మూడవ కేసులో.. కల్పిత కంపెనీల కింద నమోదు చేయబడిన 21 వాణిజ్య రికార్డుల ద్వారా 42 వర్క్ పర్మిట్లను పొందినందుకు కోర్టు మొదటి నిందితుడికి 40,000 దినార్ల జరిమానా మరియు రెండవ నిందితుడికి 2,000 దినార్ల జరిమానాతో పాటు శాశ్వతంగా బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









