బహ్రెయిన్లలో పెరిగిన బంగారం కొనుగోళ్లు.. అరేబియన్ డిజైన్లకు డిమాండ్!
- January 18, 2023
బహ్రెయిన్: కరోనా మహమ్మారి తర్వాత బహ్రెయిన్ లో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా అరేబియన్ డిజైన్లను వినియోగదారులు అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు బంగారు నగల దుకాణాల యజమానులు చెబుతున్నారు. బహ్రెయిన్లలో బంగారం పెట్టుబడికి తాజా ట్రెండ్గా మారింది. దీంతో ప్రముఖ బ్రాండ్లతో సహా అనేక దుకాణాలలో బంగారం ఇటీవల పెరిగింది. దేవ్జీ రిటైల్ సేల్స్కు చెందిన షాజీ C.K మేనేజర్ మాట్లాడుతూ..మహమ్మారి సమయంలో బంగారం డిమాండ్ తక్కువగా ఉందని, కానీ మార్కెట్ స్థిరంగా ఉందన్నారు. స్థానిక మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అరబిక్ డిజైన్లను రూపొందిస్తామన్నారు. ప్రధానంగా పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేసే వారు, ధర తగ్గినప్పుడు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారని తెలిపారు. బంగారం ధరలలో మార్పులు జరిగిన సమయంలో కొనుగోళ్లకు అధిక డిమాండ్ ఉంటుందన్నారు.
పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని దేశీయ, విదేశీ వాణిజ్య విభాగం గత ఏడాది 9.9 టన్నుల బంగారు ఆభరణాలను హాల్మార్క్ చేసిందని మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ హమద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తెలిపారు. అదే సమయంలో ముత్యాలు, విలువైన లోహాల అమ్మకాలు కింగ్డమ్ నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మంత్రిత్వ శాఖ గత రెండేళ్లలో బంగారు దుకాణాలలో 3,400 తనిఖీలు చేపట్టామన్నారు. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 38% అధికమన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







