బహ్రెయిన్లలో పెరిగిన బంగారం కొనుగోళ్లు.. అరేబియన్ డిజైన్లకు డిమాండ్!
- January 18, 2023
బహ్రెయిన్: కరోనా మహమ్మారి తర్వాత బహ్రెయిన్ లో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా అరేబియన్ డిజైన్లను వినియోగదారులు అధికంగా కొనుగోలు చేస్తున్నట్లు బంగారు నగల దుకాణాల యజమానులు చెబుతున్నారు. బహ్రెయిన్లలో బంగారం పెట్టుబడికి తాజా ట్రెండ్గా మారింది. దీంతో ప్రముఖ బ్రాండ్లతో సహా అనేక దుకాణాలలో బంగారం ఇటీవల పెరిగింది. దేవ్జీ రిటైల్ సేల్స్కు చెందిన షాజీ C.K మేనేజర్ మాట్లాడుతూ..మహమ్మారి సమయంలో బంగారం డిమాండ్ తక్కువగా ఉందని, కానీ మార్కెట్ స్థిరంగా ఉందన్నారు. స్థానిక మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా అరబిక్ డిజైన్లను రూపొందిస్తామన్నారు. ప్రధానంగా పెట్టుబడి కోసం బంగారం కొనుగోలు చేసే వారు, ధర తగ్గినప్పుడు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారని తెలిపారు. బంగారం ధరలలో మార్పులు జరిగిన సమయంలో కొనుగోళ్లకు అధిక డిమాండ్ ఉంటుందన్నారు.
పరిశ్రమలు, వాణిజ్యం, పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని దేశీయ, విదేశీ వాణిజ్య విభాగం గత ఏడాది 9.9 టన్నుల బంగారు ఆభరణాలను హాల్మార్క్ చేసిందని మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ షేక్ హమద్ బిన్ సల్మాన్ అల్ ఖలీఫా తెలిపారు. అదే సమయంలో ముత్యాలు, విలువైన లోహాల అమ్మకాలు కింగ్డమ్ నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మంత్రిత్వ శాఖ గత రెండేళ్లలో బంగారు దుకాణాలలో 3,400 తనిఖీలు చేపట్టామన్నారు. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 38% అధికమన్నారు.
తాజా వార్తలు
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ









