బోటు ప్రమాదంలో 145 మంది మృతి
- January 20, 2023
కాంగో: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. లులంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళుతున్న మోటారు బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది మృతి చెందారు. మరో 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రయాణికులు తమ సరుకులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా బసంకుసు పట్టణ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బోటులో ప్రయాణికులు, వస్తువులు, జంతువులతో నిండిపోవడంతో బోటు నదిలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ పడవ ప్రమాదాలు జరగడం కామన్అయిపోయింది. ఇక్కడ రోడ్లు లేకపోవడంతో ప్రజలు పడవల్లో నిత్యం ప్రయాణిస్తుంటారు. వలసలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతోంది. గతేడాది అక్టోబర్లో కాంగో నదిలో ఇలాంటి ఘటనే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







