బోటు ప్రమాదంలో 145 మంది మృతి
- January 20, 2023
కాంగో: రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. లులంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళుతున్న మోటారు బోటు మునిగిపోయింది. ఈ పడవ ప్రమాదంలో 145 మంది మృతి చెందారు. మరో 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రయాణికులు తమ సరుకులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు వెళుతుండగా బసంకుసు పట్టణ సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. బోటులో ప్రయాణికులు, వస్తువులు, జంతువులతో నిండిపోవడంతో బోటు నదిలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక్కడ పడవ ప్రమాదాలు జరగడం కామన్అయిపోయింది. ఇక్కడ రోడ్లు లేకపోవడంతో ప్రజలు పడవల్లో నిత్యం ప్రయాణిస్తుంటారు. వలసలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యమవుతోంది. గతేడాది అక్టోబర్లో కాంగో నదిలో ఇలాంటి ఘటనే జరిగింది. పడవ మునిగి 40 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







